BJP: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్లోని పురంధేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, హర్షద్, మైలవరపు మాధురి లావణ్య, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీలో చేరారు. తాజాగా గుడివాడ నరేంద్ర రాఘవ కూడ చేరడంతో అనేక మంది కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా కూటమి అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.