YSRCP: ఈసీని కలిసిన వైసీపీ బృందం.. ఆ బాధ్యత ఈసీదే..
- ఈసీని కలిసిన వైసీపీ నేతల బృందం..
- కూటమి గెలుపు షాక్ ఇచ్చింది..
- మొదట ఫలితాలను నమ్మలేకపోయాం..
- ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగ్పై అనుమానాలు వ్యక్తం చేసింది..
- భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం.. ఏపీ సీఈవోను కలిసిన టీమ్లో.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మెరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నేతలు ఉన్నారు.. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి గెలుపు షాక్ ఇచ్చింది.. మొదట నమ్మలేకపోయాం అన్నారు. అయితే ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగ్పై అనుమానాలు వ్యక్తం చేసింది. భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్న ఆయన.. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఈసీ చెప్పింది. తర్వాత 76.5 శాతానికి పెరిగింది. ఫైనల్గా 80.66శాతంగా ప్రకటించారు. కౌంటింగ్ సమయంలో 82 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందన్నారు.
Read Also: Tollywood: టాలీవుడ్ సూపర్ ఫాస్ట్ – 10 సినిమా న్యూస్..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
అయితే, ఎన్నికల సంఘం ఈ అనుమానాలు క్లియర్ చేయాలి. ఇవాల్టీ వరకు ఫామ్-20 అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు.. ఎవరికి పోల్ అయ్యాయని చెప్పలేదన్నారు అంబటి రాంబాబు.. ఇదోక అసాధారణమైన చర్య.. ఎందుకు ఆలస్యం అయింది. ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫీగర్కి ఎందుకు తేడా వచ్చింది.. ఇది దురదృష్టం. ఎన్నికల నిర్వహణ పై అనేక అనుమానాలు ఉన్నాయి అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మరోవైపు.. 2024 ఎన్నికల ప్రొసీజర్ సరైన క్రమంలో లేదు.. పార్లమెంటరీ వ్యవస్థలో ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు.. విధానం అనుమానాలుకు తావిచ్చేలా ఉంది అన్నారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున… ఈసీ వెంటనే స్పందించాలి. ఎన్నికల శాతం ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. ఎన్నికల శాతం పెంచుకుంటూ వెళ్లారు అని ఆరోపించారు మెరుగు నాగార్జున.
తాజావార్తలు
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!