ఏపీలో విష సంస్కృతి పెరిగిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. breaking news, latest news, telugu news, Sadineni Yamini, ycp, bjp
రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, నేడు( మంగళవారం ) మచిలీపట్నంలో జనసేన పార్టీ వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై చాలా కేసులున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు స్టేలు తెచ్చుకొని నెట్టుకొచ్చారు.. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తప్పించుకోలేకపోయారు అని ఆయన విమర్శించారు.
CM YS Jagan released 5th installment of YSR Vahana Mitra Scheme: ‘వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం’ ఐదో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం బటన్ నొక్కి వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ అయ్యాయి. వాహన మిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు లబ్ది పొందారు. లబ్ధిదారుల…
YCP MLA Varaprasad Rao Says CM YS Jagan made my childhood dream come true: ఏపీ సీఎం వైఎస్ జగన్ వల్లే తన చిన్ననాటి కల నెరవేరిందని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎవరు పెడతారోనని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, ఆ కల సీఎం జగన్ వల్ల నెరవేరిందన్నారు. మళ్లీ మళ్లీ జగన్ను గెలిపించుకుంటే మన తలరాతలు మారుతాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి…
Agriculture Support Price Poster Released By AP Minister Kakani: వ్యవసాయ మద్దతు ధరల పోస్టర్ను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సహా పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం.. సీజన్కు ముందే గిట్టుబాటు ధరను ప్రకటిస్తున్నామని మంత్రి కాకాణి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా రూప కల్పన…