Somireddy: అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి తాను ఎందుకు కావాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వివరాలు విని నివ్వెరపోయాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అరాచక ఆంధ్ర ప్రదేశ్, అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చినందుకు మళ్లీ రావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలనతో అందరినీ అణగదొక్కేందుకు సీఎం జగన్ మళ్లీ రావాలా?.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని నంబర్-1గా నిలిపినందుకు జగన్ కావాలా?.. లేక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినందుకు కావాలా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగారు.
Read Also: Anil Kumble: తాను అసలు రంగులోకి తిరిగివచ్చాడు.. కేఎల్ రాహుల్పై మాజీ లెజెండ్ ప్రశంసలు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
నీటిపారుదల, వ్యవసాయ రంగాలని ముంచినందుకు సీఎం జగన్ కావాలా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో రాష్ట్రంలో మరణ మృదంగం సృష్టిస్తున్నందుకు కావాలా?.. 87 శాతం ప్రజలకు జగన్ బటన్ నొక్కాడో లేదో తెలీదు కానీ, 100శాతం విద్యుత్ చార్జీలు, నిత్యావసరాలు పెంచేశారు.. మద్యం, ఇసుక మాఫియాలు, బడా కాంట్రాక్టర్లు, అదానీ, నత్వానీ లాంటి పేదలు జగన్ పక్కన ఉన్నారు అని ఆయన ఆరోపించారు. ఇలాంటి చేసిందుకు మళ్లీ సీఎం జగన్ కావాలా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో పాలన చేస్తుందని ఆయన అన్నారు. ఏపీలో ప్రజలు చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని చూస్తున్నారు అని సోమిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాాక ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని మాజీమంత్రి చంద్రమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?