Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bjp Leader Bhanu Prakash Reddy Fires On Ap Govt Over Daggubati Purandeswari

Bhanu Prakash Reddy: ఓటమి భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది: భాను ప్రకాశ్ రెడ్డి

Published Date :October 12, 2023 , 1:36 pm
By Sampath Kumar
Bhanu Prakash Reddy: ఓటమి భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది: భాను ప్రకాశ్ రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP Leader Bhanu Prakash Reddy Slams YCP Govt: ఓటమి భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వైసీపీ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నేడు మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత భాను ప్రకాశ్ అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు. మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని పురంధేశ్వరి కోరారు. దీన్ని తట్టుకోలేకే సజ్జల అలా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం. ఓటమి భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మా పార్టీ అధ్యక్షురాలికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వైసీపీ నేతలకు ఏం అర్హత ఉంది. పురందేశ్వరి శక్తి సామర్థ్యాలను గుర్తించే.. ఆమెకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా ప్రతిరేక విధానాలను ఆమె ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పకుండా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలి లాగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు’ అని భాను ప్రకాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.

‘ముఖ్యమంత్రి సామర్లకోటలో పర్యటిస్తుంటే.. కాకినాడలో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నాసిరకం బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మద్యం విక్రయాలలో అధికార పార్టీ నేతలు కోట్లు ఆర్జిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్యం ద్వారా కోట్ల రూపాయలను అర్జిస్తున్నారు. ఏపీలో ఐపీసీకి బదులు వైసీపీ సెక్షన్లు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలను అధికార పార్టీ నేతలు కాల రాస్తున్నారు’ అని భాను ప్రకాశ్ అన్నారు.

Also Read: Salman: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌లో అసోసియేషన్‌తో చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’

‘ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడుతున్నారు. నెల్లూరు జిల్లాలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. సొంత పార్టీలో వ్యవహారాలను పట్టించుకోకుండా బీజేపీ గురించి మాట్లాడటం అవసరమా?. పేద ప్రజలు వెంకటేశ్వరస్వామికి ఇచ్చే నిధులను కూడా తిరుపతి అభివృద్ధికి మళ్లిస్తున్నారు. టీటీడీ బడ్జెట్లో ఒక శాతం మేర నిధులు అంటే.. ఏడాదికి రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం సరికాదు. దేవాలయ నిధులను దారి మళ్లిస్తున్నారు. శానిటేషన్ పెడితే మరో రూ. 50 కోట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుంది. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్ను సీఎం జగన్ వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎంకు ప్రజలు బుద్ధి చెబుతారు’ అని భాను ప్రకాశ్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • bhanu prakash reddy
  • bjp
  • Daggubati Purandeswari
  • ycp

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions