ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గతంలో 29 ఎస్సీ నియోజకవర్గాలకు 28 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది..
Gidugu Rudra Raju Slams AP CM YS Jagan: ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగనే అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్, కేంద్రంలో బీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ అని, జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం…
ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామక్రిష్ణ అన్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కంటే జగన్ పెద్ద నియంత అని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని రామక్రిష్ణ పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ…
YCP Leader stopped the 104 Vehicle from entering the Village: నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందలూరులో వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి వీరంగం సృష్టించాడు. వైద్య సేవలందించేందుకు వెళ్లిన 104 వాహనంతో పాటు వైద్య సిబ్బందిని అతడు అడ్డుకున్నారు. తన భార్య గ్రామ సర్పంచ్ అని, మా పర్మిషన్ లేకుండా గ్రామంలోకి ఎలా వస్తారని 104 వాహనంకు ట్రాక్టర్ అడ్డుగా పెట్టాడు. అంతేకాకుండా వైద్య సిబ్బందితో శ్రీనివాస రెడ్డి వాగ్వాదానికి దిగాడు. Also…
వైసీపీ నేతల వేధింపులతో ఓ కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా హలహర్వి మండలం అమృతపురంలో చోటుచేసుకుంది. వాటర్ మ్యాన్ కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాం సూసైడ్ చేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాలచల్ చేస్తోంది. ఆమృతపురం వైసీపీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం నుంచి తీసేశారని కాంట్రాక్టు కార్మికుడు పరుశురాం ఆరోపించాడు. ఆమృతపురం వైసీపీ నాయకులు గుమ్మునూరు నారాయణస్వామి, దిబ్బిలింగ, శేఖర్ కలిసి కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాంను…
చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెప్తున్నాయని ఎంపీ సురేష్ తెలిపారు. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?.. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల తరఫున పోరాడితే, నాయకులను జైల్లో పెడుతున్నారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది.. అహంకారం ఉంటే ఏమవుతుంది అనేది తెలంగాణలో చూశాం.. మరో మూడు నెలల్లో ఇక్కడా చూస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తిరుపతి జిల్లాలోని బాలిరేడ్డిపాలెంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు.
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజల సామాజిక అభివృద్ధికి తోడ్పడేలా అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజాప్రణాళికపై సమాలోచన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని కోరారు.