CM Jagan: నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ప్రతి ఇంటికి రూ. 2,500 ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లాలోని బాలిరేడ్డిపాలెంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. వారంలోగా సాయం అందుతుంది.. విద్యుత్ సరఫరాను కూడా యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని వెల్లడించారు. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని విద్యుత్ సరఫరాను అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని అన్ని రకాలుగా ప్రభుత్వం బాధితులకు తోడుగా ఉంటుంది అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Manipur : మందుబాబు మేలుకో.. 30ఏళ్ల నిషేధానికి తెర.. తాగేంత తాగేసెయ్
Also Read
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
స్వర్ణముఖి కాలువకు పడిన గండిని పరిశీలించాను అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని 30 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వం మీది అని భావించండి.. ఈ ప్రభుత్వంలో అందరికీ మంచే జరుగుతుంది.. బాధితులకు సాయం అందకపోతే.. జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో 1902 కు ఫోన్ చేయండి.. అక్కడ నా కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారు అని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లోగా పూర్తిస్థాయిలో అందరికీ సాయం అందుతుంది.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తాం.. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం.. ప్రతి ఇంటికి రూ. 2,500 ఇస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!