Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nishant Kumar: బీహార్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ పార్టీలో చేరారు. ఆదివారం 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఈ రోజు అధికారికంగా జేడీయూలో చేరారు. రెండు దశాబ్ధాలకు పైగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. మార్చి 16న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. దీని తర్వాత ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. మరోవైపు, బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్ను డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
జేడీయూలో చేరిన తర్వాత నిశాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. నా తండ్రి రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం. దానిని అంగీకరిస్తున్నాం. ఆయన మార్గదర్శకత్వంలో మేము పనిచేస్తాము. పార్టీ, ప్రజలు నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తాను’’ అని అన్నారు.
Also Read
- Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
- PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
ఇంజనీర్ అయిన నిశాంత్ కుమార్ సీఎం కుమారుడైనప్పటికీ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. జేడీయూ సీనియర్ నేతలు నిశాంత్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని స్వాగతించారు. మరోవైపు, బీహార్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ రాజకీయాలకు జేడీయూ ఓటర్లు మోసపోయారని చెప్పింది. వెనిజులాలో మదురోను అమెరికా అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు, నితీష్ కుమార్ను కిడ్నాప్ చేసి, కేంద్రానికి తీసుకెళ్తున్నారని విమర్శించింది.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..