Gidugu Rudra Raju: ఏపీలో మాకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగన్: రుద్రరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudra Raju Slams AP CM YS Jagan: ఏపీలో తమకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగనే అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఏపీలో వైఎస్ జగన్, కేంద్రంలో బీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుందన్నారు. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అని.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ అని, జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం కాదని గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు.
‘ఏపీలో మాకు ప్రధాన ప్రత్యర్ధి సీఎం జగన్. ఏపీలో జగన్, కేంద్రంలో బిబీజేపీతో రాజీలేని పోరాటం కాంగ్రెస్ చేస్తుంది. బీజేపీతో అంటకాగేవే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. తెలంగాణలో టీడీపీ మాయమైపోయిన పార్టీ. జెండాలు కనిపించినంత మాత్రాన కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ కారణం కాదు. అధికారుల ట్రాన్సఫర్ లు జరుగుతాయి. ఇప్పుడు పొలిటికల్ ట్రాన్సఫర్ లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అంతా చెడ్డవారా. వైసీపీలో ఉన్న పాత మిత్రులను స్వాగతిస్తున్నా. నిర్బంధ పరిస్థితులలో ఉండే పదవులు అవసరమా? తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Also Read
- Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
- Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
Also Read: Shaik Sabjee Dies: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి!
‘డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ప్రతీ కార్యకర్త తమ వాహనాలు, ఇళ్ళ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి. కాంగ్రెస్ పార్టీ సెషన్ ను కాకినాడలో వందేళ్ళ క్రితం నిర్వహించారు. మరలా ఇప్పుడు కాకినాడలో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. జనవరి 5 నుంచి 9 వరకూ మండల పార్టీ అధ్యక్షులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. జనవరి 20 నుంచి ఇంటింటా కాంగ్రెస్ అనే ప్రోగ్రామ్ అన్ని నియోజకవర్గాలలో నిర్వహిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశంపై విశాఖకు రాహుల్, అమరావతి అంశంపై అమరావతికి ప్రియాంక గాంధీ, రాయలసీమ అంశలపై ఖర్గే వస్తారు. ఇండియా అలయెన్స్ పార్టీల కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నాం’ అని రుద్రరాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
-
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
-
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!