తెలంగాణ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యేలు కోవర్టులుగా పనిచేస్తున్నారు. టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి రాసిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని అన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లేఖ రాసిన ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలాను యదేచ్చగా వాడటం వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనుకూడా పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్ళకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్న సీఎం నోరు మెదపటం…
ఏపీ ఫైబర్ నెట్ లో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయి అని ఎన్టీవీతో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా టెండర్లు అప్పగించారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉంది. అవకతవకలకు పాల్పడిన అందరిపై చర్యలు ఉంటాయి. నేను గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాను అని పేర్కొన్నారు. నేను బాధ్యతలు స్వీకరించే సమయానికి ఫైబర్ నెట్ 650 కోట్ల అప్పులో ఉంది. ఏపీ ఫైబర్…
నా రాజకీయ చరిత్రో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. టీడీపీ నాయకులు గ్రహించాలి. 2006 లో నేను రాంకీ సంస్థలో ఉద్యోగం చేసాను. 2006 నుండి 2021 వరకు రాంకీ గ్రూప్ లో ఏ విధమైన షేర్లు నాకు లేవు. అది రాంకీ గ్రూప్ సంస్థ లో జరిగిన ఐటీ దాడుల్లో రుజువు అయ్యింది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక కంపెనీ,…
ఆ ఇద్దరి నేతల మధ్య నిత్యం ఆధిపత్య పోరే. ఏ చిన్న వివాదం వచ్చినా రావణకాష్టంలా మారుతుంది. మొన్నటికి మొన్న ఆ ఊరే రణరంగమైంది. ఇప్పుడు ఎన్నికలు.. మాటల తూటాలు లేవు. ప్రశాంతంగా ఉన్న సమయంలో మరో అగ్గి రాజుకుంది. సై అంటే సై అంటున్నారు. సమస్య అధికారులకు, పోలీసులకు తలనొప్పి తెచ్చిపెడుతోందట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ? తాడిపత్రిలో మళ్లీ రాజకీయ భగభగలు! మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ…
ప్రకాశం :విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాదని పేర్కొన్న ఆయన… స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత ఏపి బీజేపీదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు డెయిరీలు, స్పిన్నింగ్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ప్రవేటీకరణ చేస్తే ఏం చేశారని… పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వలన సామాన్యులపై భారం పడిందన్నారు. దీనిపై బీజేపీ ఆవేదన…
మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సీబీఐ తాజాగా మరికొందరి పేర్లు తెరపైకి తెచ్చింది. దీంతో కేసు దర్యాప్తు మరో మలుపు తిరుగుతోంది. మొన్నటివరకు మాజీ కారు డ్రైవర్ దస్తగిరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను పదే పదే విచారించిన అధికారులు.. తాజాగా వారితో పాటూ వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్ ,ఉమా మహేశ్వర్ ను గత పది రోజులుగా…
ఒకరు మాజీ మంత్రి. ఇంకొకరు అమాత్య అనిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే. ఇద్దరూ బీసీ సామాజికవర్గమే. రెండున్నరేళ్ల కేబినెట్ ప్రక్షాళన వారిని ఊరిస్తోంది. బెర్త్ కోసం ఎవరి లెక్కలు వారివే. మరి.. మంత్రివర్గంలో చేరడానికి వారు పెట్టుకున్న కొలమానం ఏంటి? ఎవరు ఏ రూట్ను ఎంచుకున్నారు? కేబినెట్లో బెర్త్ కోసం పార్థసారథి, జోగి రమేష్ ఆశలు ఆర్నెళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో బెర్త్ కన్ఫామ్ చేసుకునేందుకు కృష్ణాజిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు…
అధికార పార్టీలో ఆయన సీనియర్ నేత. సీఎంకి దగ్గరి బంధువు కూడా. కానీ ఆయన ఇప్పుడు సంతృప్తిగా లేరట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని.. చక్రం తిప్పాలని చూస్తున్న ఆ నేత ఫ్యూచర్ ఎలా ఉంటుందో? ఇంతకీ ఎవరాయన? 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు అధికార పార్టీ వైసీపీలో టీటీడీ తాజా మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చగా…
రైతు దినోత్సవాన్ని రైతు దగా దినోత్సవంగా అభివర్ణించడం బాధాకరం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంటే… టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. రైతులను టీడీపీ నాయకులు మభ్యపెడుతున్నారు. గతంలోనూ నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది వక్రబుద్ధి అని తెలిపారు ఆయన. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తే..ప్రజలు వారికి ఎన్ని స్థానాలు ఇచ్చారో తేలిపోతుంది. చంద్రబాబుతో…
తమ్మినేని సీతారాం మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. ఆయనకు అభివృద్ధి చేయడం చేతకాదు..రాదు అని అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ప్రజలను రెచ్చగొట్టి … తన్నుకుంటే చూస్తూ ఉండటం ఆయనకు ఆనందం. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడానికి తమ్మినేని సీతారాం , ఆయన కుమారుడే కారణం. తమ్మినేని ఉన్మాదిలా మాట్లాడుతూ.. కార్యకర్తలను ఉన్మాదుల్లామారుస్తున్నారు. జిల్లాలో విచ్ఛిన్న శక్తులు అరాచకం సృష్టిస్తున్నాయి. టీడీపీకి ఓటు వేస్తే మంచినీరు కూడా తాగనివ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు బాధ్యతారాహిత్యం…