చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో… చంద్రబాబు బాగా నిరాశ పడ్డాడని ఎద్దేవా చేశారు. ”కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బాగా నిరాశ పడింది ఎవరంటే చంద్రబాబే. జగడం ముదిరి మంటలు చెలరేగాలని తన వంతు ప్రయత్నం చేశాడు. జగన్ గారి లేఖలపై కేంద్రం తక్షణం స్పందించి గెజిట్ విడుదల చేయడంతో ఢీలా పడ్డాడు. శుభం పలకరా పెళ్లి కొడకా…అన్న సామెతలా ఉంది బాబు తీరు.” అంటూ చురకలు అంటించారు.
read also : తెలకపల్లి రవి : కెఆర్ఎంబి, జిఆర్ఎంబి నోటిఫికేషన్ లాభనష్టాల మధనం
Also Read
ఇక అంతకు ముందు ట్వీట్ లో ”నీరు-చెట్టు పథకాన్ని ‘తేనీరు-అట్టు’ స్కీంలా మార్చి నిధులను అడ్డగోలుగా నాకేశారు పచ్చ నేతలు. చంద్రం జమానాలోని అతి పెద్ద స్కాంలలో ఇదొకటి. 25 లక్షలు ఖర్చయ్యే ఫైబర్ చెక్ డ్యాంకు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కాంక్రీట్తో కట్టినదే కొట్టుకుపోతుంటే ఫైబర్ మెటీరియల్ ఆగుతుందా?” అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2021
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!