భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్లను గుర్తించారు. ఈ యాప్లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
Delhi: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు.
ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు, ఫైనల్ మ్యాచ్ కు వాతావరణ మార్పుల వల్ల మ్యాచ్ జరగని పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ రేపు అహ్మదాబాద్ లో వర్షం పడి మ్యాచ్ జరగకుండ ఉంటే.. మ్యాచ్ ను తర్వాత రోజుకు కేటాయించనున్నారు. ఆరోజు కూడా.. మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు.
Rohit Sharma: రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీం ఇండియాను విజయపథంలో నడిపిస్తున్న సారథి. కెప్టెన్గా వరల్డ్ కప్ టోర్నీలో తన సత్తా చాటుతున్నారు. ఇటు ఓపెనర్గా బౌలర్లను ఊచకోత కోస్తూ.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. మరోక్క విజయం సాధిస్తే, వరల్డ్ కప్ అందుకున్న మూడో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కుతారు. రేపు అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో లక్ష మంది ఫ్యాన్స్, భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు హై లెవల్ పీపుల్ మధ్య…
ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సందేశం ఇచ్చాడు. “మేము ఇప్పటివరకు చేసిన ప్రతిదీ మా వెనుక సంవత్సరాల కృషికి క్రెడిట్. మేము ఇప్పుడు కీర్తికి ఒక అడుగు దూరంలో ఉన్నాము, మేము చిన్నప్పటి నుండి కలలుగన్న కలను నిజం చేయండి ”అని పాండ్యా అన్నాడు. కప్ను తమ కోసం మాత్రమే కాకుండా.. బిలియన్ భారతీయ ప్రజల కోసం కప్ ను తీసుకురావాలని జట్టును కోరాడు.
రేపు జరిగే ఫైనల్ పోరు కోసం.. ఇప్పటికే అభిమానులు అహ్మదాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు నుంచి న్యూఢిల్లీ టూ అహ్మదాబాద్కు ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో క్రికెట్ అభిమానులకు రైల్వే తరలింపు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త.
World Cup 2023: దాదాపుగా 20 ఏళ్ల తరువాత భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో తలపడబోతున్నాయి. చివరి సారిగా 2003లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్స్లో ఆడాయి. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడాయి. అయితే ఈ మ్యాచ్ మాత్రం కోట్లాది మంది భారత అభిమానులకు చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత విజయాన్ని అడ్డుకున్నాడు
World Cup 2023: అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఏ నోట చూసినా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించే వినబడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తం క్రికెట్ ఫ్యాన్స్ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తిరంగాలతో సంబరాలు చేసుకుంటున్నారు.
అహ్మదాబాద్లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అన్నీ మ్యాచ్ ల్లో గెలిచి మంచి జోష్ లో ఉంది. అయితే వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ కేవలం ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ ఫైనల్ లో ట్రోఫీ సాధించడం వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇప్పటికే ఐదు సార్లు జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. మరో…