Travel Bus Charges: వరుస సెలవులు.. భారీగా పెరిగిన ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు..!
- ఉగాది, రంజాన్ కు వరుస సెలవులు..
- భారీగా పెరిగిన బస్సు ఛార్జీలు..
- ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు..
సామాన్యుడికి సొంతూరి ప్రయాణం భారంగా మారుతోంది. వరుస సెలవులు రావడంతో నగరాల్లో నివసించే ఉద్యోగులు, విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు దీనిని అదునుగా చేసుకుని ఛార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి.
వరుస సెలవుల ‘క్యాష్’ పాలిటిక్స్
ఈ వారం మార్చి 19న ఉగాది, 21న రంజాన్, 22న ఆదివారం కావడంతో మధ్యలో ఉన్న శుక్రవారం ఒక్క రోజు సెలవు పెడితే వరుసగా నాలుగు రోజులు పండుగను కుటుంబంతో గడపవచ్చని చాలామంది ప్రణాళికలు వేసుకున్నారు. అయితే.. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడో నిండిపోవడంతో ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే ప్రత్యామ్నాయంగా మిగిలాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని సంస్థలు సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
Also Read
సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ బస్సు ఛార్జీ సుమారు రూ. 1,500 నుంచి రూ. 2,000 మధ్య ఉంటుంది. కానీ ఈ లాంగ్ వీకెండ్ దృష్ట్యా కొన్ని ట్రావెల్స్ ధరలను ఏకంగా 3 నుంచి 4 రెట్లు పెంచేశాయి. నాన్ ఏసీ స్లీపర్ సీట్లకు కొన్ని ప్రముఖ ట్రావెల్స్ సంస్థలు ఒక వ్యక్తికి ఏకంగా రూ. 4,999 నుంచి రూ. 5,700 వరకు వసూలు చేస్తున్నాయి. ఏసీ స్లీపర్కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సర్వీసుల్లో కూడా టికెట్ ధర రూ. 5,300 దాటిపోయింది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సుల ఛార్జీలు కూడా గణనీయంగా పెరిగాయి. పండుగ రద్దీని బట్టి సాధారణ ధర కంటే రూ. 1,000 నుంచి రూ. 1,500 అదనంగా వసూలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో నిరసనలు..
పెంచిన ధరలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘విమాన ప్రయాణం కంటే బస్సు టికెట్ ధరలే ఎక్కువగా ఉన్నాయని, ఇలాగైతే ఇంటికి వెళ్లడం కంటే నగరంలోనే ఉండిపోవడం మేలు’ అని నెటిజన్లు వాపోతున్నారు. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి, అధిక ధరలు వసూలు చేసే ట్రావెల్స్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంటారు. కానీ.. ఇలాంటి ‘లాంగ్ వీకెండ్స్’ (వరుస సెలవులు) సమయంలో ప్రైవేట్ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు వీలైనంత వరకు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే అదనపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడం ద్వారా ఈ భారం నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!