World Cup 2023: భారత్ వరల్డ్ కప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తా.. సీఈఓ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2023: అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఏ నోట చూసినా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించే వినబడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తం క్రికెట్ ఫ్యాన్స్ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తిరంగాలతో సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కోసం ఒక్క భారతదేశమే కాకుండా, క్రికెట్ని ఆరాధించే అనేక దేశాలు ఎంతో ఇంట్రెస్ట్ కనబరుస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిప్యూటీ పీఎం, ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రెటీలు హాజరుకాబోతున్నారు. మరోవైపు భారత మిత్రదేశం ఇజ్రాయిల్ రాయబారి ఇండియన్ టీంకు మద్దతు తెలిపారు.
Also Read
- Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
- Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!

Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే మ్యాచ్కి కొన్ని గంటల ముందు ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈఓ పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఇండియా ప్రపంచకప్ గెలిస్తే తన యూజర్లకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. చివరిసారిగా 2011లో ఇండియా ప్రపంచకప్ గెలవడాన్ని గుర్తు చేసుకున్నారు. లింక్డ్ఇన్లో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ భారత్ చివరిసారిగా 2011లో ప్రపంచకప్ గెలిచింది. నేనను కాలేజీలో చదువుకుంటున్నాను. అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఒకటి. మేము రాత్రంతా మ్యాచ్ స్ట్రాలజీపై చర్చిస్తూనే ఉన్నందున, మ్యాచ్కి ముందు రోజు సరిగ్గా నిద్రపోలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత గూస్బంప్స్ కలిగాయి. నేను, మా ఫ్రెండ్స్ చండీగఢ్లో బైక్ ర్యాలీ తీస్తూ, బాంగ్రా చేశాము’’ అంటూ పోస్ట్ చేశారు.
గతంలో నా ఆనందాన్ని పంచుకునేందుకు స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు మాకు చాలా మంది ఆస్ట్రోటాక్ యూజర్లు ఉన్నారు. కాబట్టి వారి కోసం ఏదైనా చేయాలని, ఈ ఉదయం నా ఫైనాన్స్ టీంతో మాట్లాడానని చెప్పారు. ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే మా వినియోగదారుల వాలెట్లలో రూ. 100 కోట్లు వేస్తానని హమీ ఇచ్చారు. భారత్ గెలుపుకోసం ప్రార్థిద్దాం అని అన్నారు.
తాజావార్తలు
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!