India won Test series with 1-0 vs West Indies: వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టులో చివరి రోజైన సోమవారం పూర్తిగా ఆటను వర్షం తుడిచిపెట్టేయడంతో.. భారత్ డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. దాంతో సిరీస్ 1-0తో టీమిండియా సొంతమైంది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్ సొంతమైనా.. ప్రపంచ టెస్టు…
టీమిండియా తరపున తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ లో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. హలో అమ్మా.. నీ ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో ముకేశ్ తెలిపాడు. దీంతో ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో మరింత ఎదిగాలి అని దీవెనలు ఇచ్చింది.
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు కుప్పకూలిపోకుండా నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (235 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 75 పరుగులు) అర్ధ సెంచరీ చేయగా.. బ్లాక్వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు…
ట్రినిడాడ్లో ప్లేయింగ్ లెవన్ పై కెప్టెన్ రోహిత్ శర్మను అడిగినప్పుడు.. సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా చాలా కారణాలను చెప్పాడు. డొమినికా మరియు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపాడు. డొమినికా పరిస్థితి.. అక్కడి పిచ్ గురించి తనకు బాగా తెలుసునని రోహిత్ అన్నారు. కానీ.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విషయంలో అలా కాదన్నాడు. అంతేకాకుండా ట్రినిడాడ్ లో ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు.
IND vs WI 1st Test Highlights: డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ 130 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో రోహిత్ సేన ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (7/71) మరోసారి తన స్పిన్ మాయాజాలం చూపించాడు. అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో…
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు ఆట స్టార్ట్ కాగానే ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఈ క్రమంలోనే అతడు డెబ్యూ టెస్టులో 150 మార్క్ ను అందుకున్న ఐదో అతి చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు.
తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, తన క్లాస్ బ్యాటింగ్ చూపించాలని తపన పడుతున్నాడంటే ఏమో అనుకోవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ కూడా తన జిడ్డు బ్యాటింగ్తో అందరిని విసిగించాడు. మొదటి బంతికి ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్న విరాట్, 96 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు.. అది కూడా 81 బంతులు ఆడిన తర్వాత వచ్చింది.
వెస్టిండీస్పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో మాత్రం వీరిద్దరిలో ఎవరూ కూడా టాప్లో లేకపోవడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా విండీస్తో తమ తొలి సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలో డొమినికా వేదికగా ఇవాళ్టి (బుధవారం) నుంచి మొదటి టెస్టు ప్రారంభం కానుంది. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో తమ స్థాయికి తగ్గట్లు కెప్టెన్ రోహిత్, కోహ్లి రాణించలేక పోయారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది.