పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం అరెస్టు చేసింది.
శ్చిమ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల కారణంగా కనీసం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.
Ram Navami violence: రామ నవమి పండగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. రామనవమి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారు. హౌరా, హుగ్లీ, దల్ఖోలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేత దర్యాప్తు చేయించాలని గురువారం ఆదేశించింది.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స్కూల్ లోని విద్యార్థులను బందీలుగా చేసుకునేందుకు ఓ వ్యక్తి తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ ఘటన మాల్డా జిల్లాలోని ముచియా చంద్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
పశ్చిమ బెంగాల్లో మరోసారి హింస చలరేగింది. ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని కలియాగంజ్లో ఓ మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనారిటీలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)కి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించరని సీఎం మమత ప్రకటించారు.
బెంగాల్ లో శాంతి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ కోరారు. తమకు హింస వద్దన్నారు. దేశంలో విభజన వద్దన్నారు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నవారికి.. ఈద్ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నానని.. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని.. కానీ దేశాన్ని విభజన కానివ్వన్నారు.
పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో అనుమతి ఉన్నప్పటికీ రామనవమి ఊరేగింపుపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హౌరా కమిషనర్ ఆఫ్ పోలీస్లకు హక్కు సంఘం నోటీసులు జారీ చేసింది.
దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎండలు మండిపోతున్నాయి. వేడి ప్రజలకు అల్లాడిపోతున్నారు. బెంగాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో చాలా మంది ప్రజలు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ఎండలో ప్రయాణించాల్సిన పరిస్థితి.
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.