Mamata Banerjee: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. అమిత్ షాకు మమతా బెనర్జీ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదాను కోల్పోయిన తర్వాత తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసినట్లు రుజువైతే తాను రాజీనామా చేస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
తృణమూల్ అర్హతను సమీక్షించిన తర్వాత ఈ నెల ప్రారంభంలో ఎన్నికల సంఘం దాని జాతీయ పార్టీ హోదాను తొలగించింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తృణమూల్ జాతీయ హోదాను పునరుద్ధరించాలని అభ్యర్థించారని ప్రతిపక్ష నాయకుడు సువేందు ఆరోపించారు. దాంతో టీఎంసీ అధినేత్రి స్పందించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలోకి ఫిరాయించిన సువేందు అధికారి అబద్ధాలు చెబుతున్నారని దీదీ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై కూడా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు నిశ్శబ్దం బంగారు రంగులో ఉంటుందని, ప్రతిపక్షం కలిసి కూర్చోవడం లేదని అనుకోవదన్నారు. ప్రతి ఒక్కరూ మరొకరితో సంబంధాలను కొనసాగిస్తున్నారని తెలిపారు.
Also Read:Kishan Reddy : సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
Also Read
తాను బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ టీఎంసీ నేత ముకుల్ రాయ్ చేసిన వ్యాఖ్యలపై కూడా దీదీ స్పందించారు. ముకుల్ రాయ్ బిజెపి ఎమ్మెల్యే అని, అతను ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అది అతని ఇష్టం అని ఆమె అన్నారు. ఎవరైనా ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అది పూర్తిగా అతని సొంత హక్కు అని తెలిపారు. అయితే తన తండ్రిని కిడ్నాప్ చేశారంటూ కొడుకు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.
కాగా, కృష్ణనగర్ ఉత్తరం నుండి ఎమ్మెల్యే అయిన ముకుల్ రాయ్ సోమవారం రాత్రి కొన్ని వ్యక్తిగత పని కోసం న్యూఢిల్లీకి వెళ్లారు. అయితే, ఆయన అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆ తర్వాత, అనారోగ్యంతో ఉన్న టీఎంసీ నాయకుడిని ఉపయోగించుకుని బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని రాయ్ కుటుంబం ఆరోపించింది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!