West Bengal Minister Manoj Tiwary retires from all forms of cricket: భారత వెటరన్ ప్లేయర్, ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ రిటైర్మెంట్ ప్రకటించారు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘క్రికెట్ ఆటకు వీడ్కోలు’ అని తివారీ తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ఆట తనకు అన్నింటినీ ఇచ్చిందని, ఆద్యంతం తన పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు మరియు…
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను పామ్ అవెన్యూ నివాసం నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించారు.
Bengal Couple Sells off Son to buy iPhone 14: కన్న బిడ్డకు ఆకలి వేసినా లేదా చిన్న దెబ్బ తగిలినా.. తల్లిదండ్రులు చలించిపోతారు. బిడ్డ చికిత్సకు చేతిలో డబ్బు లేకపోతే నగలు, ఇల్లు, పొలాలు అమ్మడానికి కూడా వెనకాడరు. కడుపున పుట్టిన వారి కోసం ఏమైనా త్యాగం చేయడనికి సిద్ధపడుతారు. అయితే పశ్చిమ బెంగాల్లో ఓ తల్లిదండ్రులు సమాజం తలదించుకునే పనిచేశారు. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి ఖరీదైన ‘ఐఫోన్’ కొనాలనుకుని.. డబ్బుల…
పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కూడా ఉందని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు.
Dowry case: పెళ్లి సమయంలో కూతురికి నగదు కాకుండా 6 గ్రాముల బంగారం ఇస్తామని ఓ తండ్రి హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే నగదు, మూడు గ్రాముల బంగారం ముట్టజెప్పాడు. మిగతా మూడు గ్రాముల బంగారం ఆర్థిక సమస్యల కారణంగా ఇవ్వలేకపోయాడు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జైలులో జరిగింది. వేరు వేరు హత్యా నేరాల్లో దోషులుగా శిక్షపడి జైలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు. వధువు పేరు సహనారా ఖాటున్, వరుడి పేరు అబ్దుల్ హసీమ్. బర్ధమాన్ సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. అయితే.. అక్కడే ఇద్దరు మొదటి సారి కులుసుకున్నారు.. అనంతరం చిగురించి స్నేహం.. కాస్త ప్రేమగా మారింది. వారి సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం…
Bengal panchayat polls: గత నెల కాలంగా పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింస నెలకొంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా ఈ రోజు ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) హవా కొనసాగింది. ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ, గ్రామీణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. గత నెల ప్రారంభంలో పంచాయతీ ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఘర్షణల్లో 33 మందికి పైగా మరణించడంతో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.