panchayat election results: నేడు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
panchayat election results: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ, గ్రామీణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. గత నెల ప్రారంభంలో పంచాయతీ ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఘర్షణల్లో 40 మందికి పైగా మరణించడంతో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. మూడంచెల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 61,000కు పైగా బూత్లలో జూలై 8న పోలింగ్ నిర్వహించగా, 80.71 శాతం ఓటింగ్ నమోదైంది. పలు చోట్ల బ్యాలెట్ బాక్సులను కొల్లగొట్టి, నిప్పుపెట్టి, చెరువుల్లో పడేసి హింసకు దారితీసింది. ఓటింగ్ రోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో జులై 10వ తేదీన దాదాపు 696 బూత్లలో రీపోలింగ్ చేయాల్సి వచ్చింది. రీపోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కూడా ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్షగా భావించే పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానుండగా.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
Also Read: Uttar Pradesh: ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్..9 మంది మృతి..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
జూలై 8 ఓటింగ్ సందర్భంగా నమోదైన ఘోరమైన హింసాకాండ, బూత్ క్యాప్చర్ సంఘటనల నేపథ్యంలో బెంగాల్లోని 19 జిల్లాల్లోని 696 బూత్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన రీ-పోలింగ్ జరగగా.. 69.85 శాతం మంది అర్హులైన ఓటర్లు సోమవారం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం మరో నలుగురు వ్యక్తులు మరణించినట్లు నివేదించబడింది. ఓట్ ట్యాంపరింగ్ ఆరోపణలు పంచాయితీ ఎన్నికలను దెబ్బతీశాయి. బెంగాల్లోని మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని ప్రభావిత బూత్లలో రీపోలింగ్కు ఆదేశించాలని రాజీవ్ సిన్హా నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం, రాష్ట్ర పోలీసులతో పాటు ప్రతి బూత్లో కనీసం నలుగురు కేంద్ర బలగాల సిబ్బందిని మోహరించి గట్టి భద్రత మధ్య ఉదయం 7 గంటలకు రీపోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ బూత్లలో సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఓవర్ టైం పని చేస్తున్న ఎన్నికల అధికారులతో ఓటు వేసేందుకు అనుమతించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!