panchayat election results: నేడు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
panchayat election results: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ, గ్రామీణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. గత నెల ప్రారంభంలో పంచాయతీ ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఘర్షణల్లో 40 మందికి పైగా మరణించడంతో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. మూడంచెల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 61,000కు పైగా బూత్లలో జూలై 8న పోలింగ్ నిర్వహించగా, 80.71 శాతం ఓటింగ్ నమోదైంది. పలు చోట్ల బ్యాలెట్ బాక్సులను కొల్లగొట్టి, నిప్పుపెట్టి, చెరువుల్లో పడేసి హింసకు దారితీసింది. ఓటింగ్ రోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో జులై 10వ తేదీన దాదాపు 696 బూత్లలో రీపోలింగ్ చేయాల్సి వచ్చింది. రీపోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కూడా ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్షగా భావించే పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానుండగా.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
Also Read: Uttar Pradesh: ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్..9 మంది మృతి..
Also Read
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
జూలై 8 ఓటింగ్ సందర్భంగా నమోదైన ఘోరమైన హింసాకాండ, బూత్ క్యాప్చర్ సంఘటనల నేపథ్యంలో బెంగాల్లోని 19 జిల్లాల్లోని 696 బూత్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన రీ-పోలింగ్ జరగగా.. 69.85 శాతం మంది అర్హులైన ఓటర్లు సోమవారం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం మరో నలుగురు వ్యక్తులు మరణించినట్లు నివేదించబడింది. ఓట్ ట్యాంపరింగ్ ఆరోపణలు పంచాయితీ ఎన్నికలను దెబ్బతీశాయి. బెంగాల్లోని మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని ప్రభావిత బూత్లలో రీపోలింగ్కు ఆదేశించాలని రాజీవ్ సిన్హా నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం, రాష్ట్ర పోలీసులతో పాటు ప్రతి బూత్లో కనీసం నలుగురు కేంద్ర బలగాల సిబ్బందిని మోహరించి గట్టి భద్రత మధ్య ఉదయం 7 గంటలకు రీపోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ బూత్లలో సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఓవర్ టైం పని చేస్తున్న ఎన్నికల అధికారులతో ఓటు వేసేందుకు అనుమతించారు.
తాజావార్తలు
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!