Padma Hilsa: భారతీయులకు, ముఖ్యంగా బెంగాలీలకు బంగ్లాదేశ్ తీపి కబురు చెప్పింది. దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్టు ఇవ్వబోతోంది. పద్మా పులస(పద్మా హిల్సా) చేపల ఎగుమతికి ఓకే చెప్పింది. దుర్గాపూజ సీజన్కి ముందు 4000 మెట్రిక్ టన్నలు హిల్సా చేపలను విక్రయించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. భారతీయ చేపల వ్యాపారుల ద్వారా ఈ రోజు రాత్రికి దేశానికి చేరుకుంటుంది.
Indian Railways: భారతీయ రైల్వే స్టేషన్లకు సంబంధించిన కొన్ని కథనాలు తరచుగా వింటూనే ఉంటాయి. తెలియనివి కూడా ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అలాంటి ఒక వాస్తవాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం.
ఇండియా పేరును భారత్గా మారుస్తామని, కోల్కతాలోని విదేశీయుల విగ్రహాలను తొలగిస్తామని పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ అన్నారు. పేరు మార్పును వ్యతిరేకించే వారు దేశం విడిచి వెళ్లవచ్చని మేదినీపూర్ ఎంపీ అన్నారు.
Husband's gift to wife: భార్యకు పెళ్లి మందు చేసి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు భర్త ఏకంగా చంద్రుడిపై భూమినే కొనుగోలు చేశాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఝర్గ్రామ్ జిల్లాకు చెందిన వ్యక్తి భార్య పుట్టిన రోజు చంద్రుడిపై భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఒక ఎకరం భూమిని రూ. 10,000లకు కొనుగోలు చేసిన సంజయ్ మహతో తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. పెళ్లికి ముందు తన భార్యకు చంద్రుడిని తీసుకువస్తానని హామీ ఇచ్చినందకు ఇలా చంద్రుడిని గిఫ్ట్ గా…
పశ్చమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ జేమ్స్ బాండ్లా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ సహా ఏడు యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీసుకున్న చర్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Telia Bhola Fish: ఒక్కోసారి ఈ ఏడాది మనకు అస్సలు బాలేదు. కాలం కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుుడే మెరుపులా భలే ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కష్టం తీరిపోతే సూపర్ గా ఉంటుంది కదా. అలాగే జరిగింది పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం మారిపోయింది అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం.ఇలాంటివి ఎక్కువ వెస్ట్ బెంగాల్ లోనే జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం…
బెంగాల్లో 5న జరగబోయే ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం కలిసి అధికార టీఎంసీపై దాడిని పెంచాయి. ఇండియా కూటమిలో ఒకవైపు మూడు పార్టీలు కలిసి ఉంటూనే.. ఉప ఎన్నిక రాగానే ప్రచారంలో అధికార టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం ఘాటు విమర్శలు చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరుతూ బీజేపీ నేత సువేందు అధికారి పిల్ వేశారు. అయితే దానిని విచారించేందుకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది.
West Bengal Student Murder: మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఏ దోమనో, చీమనో చంపినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ వయసువారైనా బెదురు లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. శిక్ష గురించి భయపడటం లేదు, పాపం పుణ్యం అని ఆలోచించడం లేదు. ఇక మానవ్వతం అయితే మచ్చుకైనా కనిపించడం లేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆలోచనా విధానం ఉన్నతంగా మారాలి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లు, సినిమాలు, సీరియల్స్…