West Bengal: హత్య కేసులో జైలుకెళ్లి.. పెరోల్ పై వచ్చి పెళ్లి చేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో తెలియదు.. ఒక్కసారి ప్రేమలో పడితే.. చనిపోవడానికైనా సిద్ధపడిపోతారు ప్రేమికులు. అంతలా ప్రేమ మైకంలో మునిగిపోతారు. తమ ప్రేమ కోసం ఎంతటి వారినైనా వారు ఎదిరిస్తారు. అయితే, ఓ ప్రేమ జంట జైల్లో ప్రేమించుకుని పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు.. అదేనండి.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జైలులో జరిగింది. వేరు వేరు హత్యా నేరాల్లో దోషులుగా శిక్షపడి జైలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు.
Read Also: Daggubati Purandeswari: సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.. పురందేశ్వరి పిలుపు
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఇద్దరు నేరస్తులు హత్యా నేరంలో దోషులుగా తేలి బర్ధమాన్ సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. అయితే.. అక్కడే ఇద్దరు మొదటి సారి కులుసుకున్నారు.. అనంతరం చిగురించి స్నేహం.. కాస్త ప్రేమగా మారింది. వారి సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వివాహ వేడుక కోసం ఈ జంట ఐదు రోజులు పెరోల్పై రిలీజ్ అయ్యారు. అనంతరం తూర్పు బర్ధమాన్లోని మాంటేశ్వర్ బ్లాక్లోని కుసుమ్గ్రామ్లో ముస్లిం చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
Read Also: Viral Video: పాకిస్తాన్ చంద్రయాన్.. చూసి నవ్వుకుంటున్న జనాలు..!
వధువు పేరు సహనారా ఖాటున్, వరుడి పేరు అబ్దుల్ హసీమ్. కాగా, ఈ విషయంపై అబ్దుల్ మాట్లాడుతూ తామిద్దరం బర్ధమాన్ సెంట్రల్ జైల్లో నిర్బంధించబడ్డాము. అదే రోజు మా సహచర ఖైదీలు మమ్మల్ని కలవడానికి వచ్చారు.. మేము అక్కడ నుంచి ఒకరినొకరు చూసుకున్నామని తెలిపాడు. కొద్ది కొద్దిగా మా మధ్య మాటలు పెరిగి.. అది పెళ్లి వరకు వెళ్లిందని అబ్దుల్ చెప్పాడు. మా జీవితంలోని చీకటి నుంచి బయటపడి, మా జీవితాలను చక్కగా గడపాలని కోరుకుంటున్నామని అతడు చెప్పాడు.
Read Also: Sai Pallavi: అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..
సహనారా మాట్లాడుతూ.. మేం జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఈ జీవితాన్ని మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అందరిలాగే తాము జీవించాలని ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే, బీర్భూమ్ నివాసి ఖాటున్ గత ఆరేళ్లుగా జైలులో ఉండగా, అస్సాంకు చెందిన అబ్దుల్ హసీమ్ ఎనిమిదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. బర్ధమాన్ సెంట్రల్ జైల్లో వివాహం జరగడం ఇదే మొదటిసారి. పెళ్లి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ జైలుకు వచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?