Mamata Banerjee: బెంగాల్కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్కు ఎందుకు పంపలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ ‘బేటీ బచావో’ పథకం ఇప్పుడు ‘బేటీ జలావో’ (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు. జాతి కలహాలు ఇప్పటివరకు 160 మందిని బలిగొన్న మణిపూర్కు కేంద్ర బృందాలను పంపేందుకు కేంద్రం ఎందుకు ఆలోచించలేదని మమతా బెనర్జీ ప్రశ్నించారు. మణిపూర్కు సంఘీభావం తెలియజేసిన మమతాబెనర్జీ.. బీజేపీ బెంగాల్కు చాలా కేంద్ర బృందాలను పంపిందని, ఈశాన్య రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని ఎందుకు పంపలేదని ఆమె ప్రశ్నించింది.
Also Read: ED Raids: ఛత్తీస్గఢ్లో ఈడీ దాడులు.. కాంగ్రెస్ నేత, ఐఏఎస్ అధికారుల నివాసాలపై రైడ్స్
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఇక్కడ పార్టీ వార్షిక అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ.. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి I.N.D.I.Aకి ఆమె సంఘీభావం తెలిపారు. కాషాయ శిబిరాన్ని అధికారం నుంచి తొలగించడమే తమ ధ్యేయమని నొక్కి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యం పతనానికి సంకేతమని ఆమె హెచ్చరించారు. బీజేపీ గద్దె దించడమే తమ ధ్యేయమన్నారు టీఎంసీ బాస్ మమతా బెనర్జీ. 2024లో కేంద్రం నుంచి బీజేపీని గద్దె దింపడం తప్ప తమకు వేరే డిమాండ్ లేదన్నారు. తమకు ఏ కుర్చీ వద్దు అని చెప్పడం ద్వారా వ్యక్తిగత ఆశయాల వాదనలను మమతా బెనర్జీ తిప్పికొట్టారు.
Also Read: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!
ఈ 26 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతిపక్ష కూటమి – I.N.D.I.A. అనే బ్యానర్తో తాము కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తామన్నారు. కూటమి పోరాడుతుందని, తృణమూల్ సైనికుడిలా అండగా నిలుస్తుందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని మమతా బెనర్జీ అన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!