విశాఖపట్నంలోని జూపార్క్లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన బోట్ల దగ్ధం కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించనున్నారు. సుమారు 47 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందజేసన జనసేన పవన్ కళ్యాణ్. శుక్రవారం విశాఖలో పర్యటించిన పవన్ ఈ సందర్భంగా మత్స్య కారులకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘వైసీపీతో సహా మిగిలిన రాజకీయ పార్టీల్లా నేను ఎప్పుడు మత్స్యకారులను ఓట్ బ్యాంకులా చూడలేదు. మీరు…
ఆంధ్రప్రదేశ్లో విశాఖ నుంచే పరిపాలన విషయంలో కీలక పరిణామం జరిగింది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Heavy Security for India vs Australia 1st T20 in Visakhapatnam: వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత సొంతగడ్డపై భారత్ ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమవుతోంది. 2023 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. వైజాగ్ వేదికగా గురువారం భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. వైజాగ్లోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్…
విశాఖపట్నంలోని పెందుర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తిలోని చిన్న ముసలివాడ గణేష్ నగర్ ప్రాంతంలో ఆవేశంలో అత్తను అల్లుడుచంపేశాడు. మృతురాలి పేరు దొగ్గ లక్ష్మీ వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. హంతకుడు కే. సన్యాసి నాయుడిగా పోలీసులు గుర్తించారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు.