Home
Visakhapatnam
Visakhapatnam News
-
విశాఖ జిల్లాను భయపెడుతున్న అగ్నిప్రమాదాలు… అర్ధరాత్రి మరో ప్రమాదం…
విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా, అర్ధరాత్రి సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు… -
విశాఖలో మరో ప్రమాదం.. హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
విశాఖలో గ్యాస్ లీక్లు, అగ్నిప్రమాదలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.. ఓ ఘటన జరిగి.. అది కాస్త మర్చిపోయే సమయానికి మరో సంఘటన ప్రజలను వణికిస్తోంది.. ఇవాళ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. రిఫైనరీ నుండి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.. ఇక, సైరన్ మోగడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీసినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో.. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. మరోవైపు,… -
విశాఖ సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా…ఏడుగురు గల్లంతు…
విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ రెండు పడవల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద జరిగింది. తెలంగాణలో లాక్డౌన్ కావడంతో వీరంతా సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి… -
విశాఖ కార్పొరేషన్ కీలక నిర్ణయం… ఆదివారం ఆ మార్కెట్లు బంద్…
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం… -
అరకులో సంపూర్ణ లాక్ డౌన్… ఎప్పటి వరకు అంటే…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్… -
విశాఖలో కిటకిటలాడుతోన్న మెడికల్ షాపులు…
విశాఖ నగరంలో మెడికల్ షాపులు కిటకిటలాడుతోన్నాయి. మెడికల్ షాపుల ముందు బారులు తీరుతోన్నారు విశాఖ వాసులు. కొద్దిపాటి లక్షణాలు.. హోం ఐసోలేషనులో ఉన్న వారి కోసం మందులు కొనుగోళ్లకు రోడ్లపైకి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఫాబి ఫ్లూ వంటి టాబ్లెట్లకు కొన్ని రకాల బ్రాండ్లల్లో కొరత ఉంటుంది అని మెడికల్ షాప్ ఓనర్లు. అయితే విశాఖలో ఆక్సీ మీటర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే ఏపీలో ఈ కరోనా సెకండ్ వేవ్ లో రోజుకు 20… -
విశాఖలో కరోనా వార్డును తనిఖీ చేసిన విజయసాయిరెడ్డి…
విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్స్, వైరాలజీ ల్యాబ్, కేజీహెచ్ హాస్పిటల్ను వెస్ఆర్సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లేనిపోని అనుమానాలు, భయాలు… -
విశాఖ కోవిడ్ ఆస్పత్రుల్లో కన్నీటి వ్యథలు..!
కరోనా వ్యథలు అన్నీ ఇన్ని కాకుండా పోయాయి.. కరోనా బారినపడిన ఆస్పత్రులకు వెళ్తే.. తిరిగి వస్తారా? అని గ్యారేంటి లేని పరిస్థితి.. ఇక, విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. కేజీహెచ్ సి ఎస్ ఆర్ బ్లాక్ వద్ద కరోనా పేషెంట్లు, బంధువులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. గంటల తరబడి బెడ్స్ కోసం వేచివుంటున్నా వైనం ఎక్కడచూసినా కనిపిస్తోంది.. బెడ్స్ లేక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా రోగులు… కరోనా పేషెంట్లకు సరిగ్గా… -
విశాఖ మధురవాడలో విషాదం… నలుగురు మృతి… పలు అనుమానాలు
విశాఖపట్నంలోని మధురవాడలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిత్య ఫార్చూన్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ప్లాట్ నెంబర్ 505 లో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు. అయితే, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు… -
విశాఖ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక… కొత్త నిబంధనలు అమలు
రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లే దారి, బయటకు వచ్చేదారి వేరువేరుగా ఏర్పాటు చేయబోతున్నారు. రైల్వేస్టేషన్ కి వచ్చే ప్రయాణికులు జ్ఞానాపురం గెట్ వద్దనున్న ఎనిమిదో నెంబర్ ప్లాట్ ఫామ్ మీదుగా లోపలికి అనుమతిస్తారు. థర్మల్ స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేవారికి ఒకటో నెంబర్…
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!