Home
Visakhapatnam
Visakhapatnam News
-
ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధుల గోల్ మాల్…
విశాఖ ఎక్సయిజ్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతుంది. ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పరిధిలోని 14షాపుల్లో నగదు తేడాలు గుర్తించారు. లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు సిబ్బంది. వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అక్రమార్కులు నొక్కేసిన నగదు చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం. సర్కిల్-4లో వెలుగు చూసిన సిబ్బంది చేతివాటంతో విచారణ మొదలయింది. ఫేక్ చలాన్ల తో బ్యాంకు, ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయలు మాయం చేసారు.… -
మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ… -
విశాఖ జిల్లాను భయపెడుతున్న అగ్నిప్రమాదాలు… అర్ధరాత్రి మరో ప్రమాదం…
విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా, అర్ధరాత్రి సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు… -
విశాఖలో మరో ప్రమాదం.. హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
విశాఖలో గ్యాస్ లీక్లు, అగ్నిప్రమాదలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.. ఓ ఘటన జరిగి.. అది కాస్త మర్చిపోయే సమయానికి మరో సంఘటన ప్రజలను వణికిస్తోంది.. ఇవాళ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. రిఫైనరీ నుండి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.. ఇక, సైరన్ మోగడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీసినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో.. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. మరోవైపు,… -
విశాఖ సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా…ఏడుగురు గల్లంతు…
విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ రెండు పడవల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద జరిగింది. తెలంగాణలో లాక్డౌన్ కావడంతో వీరంతా సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి… -
విశాఖ కార్పొరేషన్ కీలక నిర్ణయం… ఆదివారం ఆ మార్కెట్లు బంద్…
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం… -
అరకులో సంపూర్ణ లాక్ డౌన్… ఎప్పటి వరకు అంటే…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్… -
విశాఖలో కిటకిటలాడుతోన్న మెడికల్ షాపులు…
విశాఖ నగరంలో మెడికల్ షాపులు కిటకిటలాడుతోన్నాయి. మెడికల్ షాపుల ముందు బారులు తీరుతోన్నారు విశాఖ వాసులు. కొద్దిపాటి లక్షణాలు.. హోం ఐసోలేషనులో ఉన్న వారి కోసం మందులు కొనుగోళ్లకు రోడ్లపైకి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఫాబి ఫ్లూ వంటి టాబ్లెట్లకు కొన్ని రకాల బ్రాండ్లల్లో కొరత ఉంటుంది అని మెడికల్ షాప్ ఓనర్లు. అయితే విశాఖలో ఆక్సీ మీటర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే ఏపీలో ఈ కరోనా సెకండ్ వేవ్ లో రోజుకు 20… -
విశాఖలో కరోనా వార్డును తనిఖీ చేసిన విజయసాయిరెడ్డి…
విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్స్, వైరాలజీ ల్యాబ్, కేజీహెచ్ హాస్పిటల్ను వెస్ఆర్సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లేనిపోని అనుమానాలు, భయాలు… -
విశాఖ కోవిడ్ ఆస్పత్రుల్లో కన్నీటి వ్యథలు..!
కరోనా వ్యథలు అన్నీ ఇన్ని కాకుండా పోయాయి.. కరోనా బారినపడిన ఆస్పత్రులకు వెళ్తే.. తిరిగి వస్తారా? అని గ్యారేంటి లేని పరిస్థితి.. ఇక, విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. కేజీహెచ్ సి ఎస్ ఆర్ బ్లాక్ వద్ద కరోనా పేషెంట్లు, బంధువులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. గంటల తరబడి బెడ్స్ కోసం వేచివుంటున్నా వైనం ఎక్కడచూసినా కనిపిస్తోంది.. బెడ్స్ లేక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా రోగులు… కరోనా పేషెంట్లకు సరిగ్గా…
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!