IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు…
IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్ను కోల్పోయింది.
విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్మన్గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్లో ఒక్కొక్క స్థానం మెరుగుపరచుకున్నారు. కోహ్లీ మళ్ళీ టాప్-5లోకి చేరాడు. 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.
IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తన విజయయాత్రను కొనసాగించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని 241 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్ధేశించింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఈ లక్ష్యాన్ని కేవలం 42.3 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది. చివరి పరుగులను విరాట్…
టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ మైదానంలో అన్ని రకాల షాట్స్ ఆడుతాడు. ‘కవర్ డ్రైవ్’ బాగా ఆడతాడని కోహ్లీకి పేరు. అయితే ఇటీవల తన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ షాటే తనకు బలహీనతగా మారిందని అంగీకరించాడు. ఇటీవలి కాలంలో కవర్ డ్రైవ్ కోసం ప్రయత్నిస్తూ.. స్లిప్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుతున్న సంగతి తెలిసిందే. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్పై మాత్రం అద్భుత కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. దీనిపై విరాట్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51వ సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో కింగ్ సెంచరీ చేయడంతో అతడి ఫాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అయితే పాకిస్థాన్పై విరాట్ సెంచరీ చేస్తాడో లేదో అని ఫాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు. అందుకు కారణం జట్టు చేయాల్సిన రన్స్…
Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ని కొట్టలేకపోతోంది. పాక్తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం. Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య…
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.