Nehal Wadhera: విరాట్ నా పేరు గుర్తు పెట్టుకోవడమా.. షాక్కు గురయ్యా!
- ఐపీఎల్ 2025లో రాణిస్తున్న నేహాల్ వధేరా
- 7 మ్యాచ్ల్లో 146.51 స్ట్రైక్ రేట్తో 189 పరుగులు
- విరాట్ నా పేరు గుర్తు పెట్టుకోవడమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పేరు గుర్తు పెట్టుకోవడంతో షాక్కు గురయ్యా అని పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు నేహాల్ వధేరా తెలిపాడు. విరాట్ తన షాట్ సెలక్షన్ను ఎంతో మెచ్చుకున్నాడని, కోహ్లీ భాయ్తో మాట్లాడడంతో ఆట పట్ల తన దృక్పథం మారిందన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ గెలిచిన తర్వాత తానెంతో ఆరాధించే యువరాజ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని నేహాల్ వధేరా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో రాణిస్తున్న నేహాల్ 7 మ్యాచ్ల్లో 37.80 సగటు, 146.51 స్ట్రైక్ రేట్తో 189 పరుగులు చేశాడు.
బెంగళూరుపై 33 పరుగులు చేసి పంజాబ్ను గెలిపించిన తర్వాత నేహాల్ వధేరాతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ‘బెంగళూరు, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా మా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో విరాట్ భాయ్ మాట్లాడుతున్నాడు. నేను వారికి సమీపంగా వెళ్లగానే.. ఎలా ఉన్నావ్ నేహాల్ అని పంజాబీలో కోహ్లీ పలకరించాడు. విరాట్ నా పేరు గుర్తు పెట్టుకోవడంతో షాక్కు గురయ్యా. నేను గత రెండేళ్లుగా కోహ్లీతో మాట్లాడాలని అనుకున్నా. ముంబై తరఫున ఆడినప్పుడు సూర్య, తిలక్ భాయ్లకు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పా. ఆ తపనే కోహ్లీని కలవడానికి కారణమైంది. గత రెండేళ్లుగా నా ఆట చూస్తున్నారు, ఎలా ఉంది? అని కోహ్లీని అడిగాను. నా షాట్ సెలక్షన్ చాలా బాగుందన్నారు. విరాట్ భాయ్తో మాట్లాడడంతో ఆట పట్ల నా దృక్పథం పూర్తిగా మారింది’ అని నేహాల్ తెలిపాడు.
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
Also Read: CM Chandrababu: మంత్రి పదవి అడిగితే.. నన్ను కిందికి పైకి చూశారు!
ఆర్సీబీపై పంజాబ్ గెలిచిన తర్వాత యువరాజ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని 24 ఏళ్ల నేహాల్ వధేరా చెప్పాడు. యువీ మాటలు తనకు బంగారం లాంటివని, మరింత రాణించేందుకు యువీ సలహాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. నేహాల్ వాధేరా 2023లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ తరపున సత్తా చాటుతున్నాడు. 7 మ్యాచ్ల్లో 189 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!