RCB vs RR: ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్కు చేరువైన ఆర్సీబీ!
- ఎట్టకేలకు సొంతగడ్డపై బెంగళూరు గెలుపు
- చిన్నస్వామి స్టేడియంలో 11 పరుగుల తేడాతో విజయం
- ప్లేఆఫ్స్కు చేరువైన బెంగళూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. మరోవైపు ఏడో ఓటమి చవిచూసిన రాజస్థాన్.. దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (70; 42 బంతుల్లో 8×4, 2×6), దేవదత్ పడిక్కల్ (50; 27 బంతుల్లో 4×4 3×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఫీల్ సాల్ట్ (26; 23 బంతుల్లో 4×4) కీలక పరుగులు చేశాడు. సాల్ట్ త్వరగానే పెవిలియన్ చేరినా.. కోహ్లీ, పడిక్కల్ కలిసి పరుగుల వరద పారించారు. కొద్ది తేడాలో కోహ్లీ, పడిక్కల్, రజత్ పాటీదార్ (1) నిష్క్రమించడంతో.. 17 ఓవర్లలో 167/4తో ఆర్సీబీ నిలిచింది. చివరలో టిమ్ డేవిడ్ (23; 15 బంతుల్లో 2×4, 1×6), జితేశ్ శర్మ (20 నాటౌట్; 10 బంతుల్లో 4×4) బ్యాట్ ఝళిపించడంతో ఈ సీజన్లో తొలిసారి ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. సందీప్ శర్మ రెండు వికెట్స్ పడగొట్టాడు.
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
ఛేదనలో రాజస్థాన్కు శుభారంభం దక్కింది. యశస్వి జైస్వాల్ (49; 19 బంతుల్లో 7×4, 3×6), వైభవ్ సూర్యవంశీ (16) ధనాధన్ బ్యాటింగ్తో అలరించారు. అయిదో ఓవర్లో వైభవ్, 6వ ఓవర్లో జైస్వాల్ నిష్క్రమించారు. నితీశ్ రాణా (28), రియాన్ పరాగ్ (22) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 9 ఓవర్లలో 110/2తో రాజస్థాన్ లక్ష్యం దిశగా సాగింది. అయితే పరాగ్ను కృనాల్ పాండ్యా ఔట్ చేయడం, స్పిన్నర్ సుయశ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. రాణాను కూడా కృనాల్ అవుట్ చేయడంతో రాయల్స్పై ఒత్తిడి పెరిగింది. ధ్రువ్ జురెల్ (47; 34 బంతుల్లో 3×4, 3×6) ధాటిగా బ్యాటింగ్ చేసినా.. హెట్మయర్ (11) నిరాహపర్చాడు. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సివుండగా.. ఆర్సీబీ బౌలర్లు అద్భుతం చేశారు. 19వ ఓవర్లో హేజిల్వుడ్ 2 వికెట్స్ తీసి ఒక్క పరుగే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో యశ్ దయాళ్ 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
-
Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
-
Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!