Home
Virat Kohli
Virat Kohli News
-
తడబడిన టీమిండియా… న్యూజిలాండ్ ముందు స్వల్ప టార్గెట్
టీ20 ప్రపంచకప్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా తడబడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషాన్ (4), కేఎల్ రాహుల్ (18) చెత్త షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ (14), కోహ్లీ (9) కూడా వారినే అనుకరించారు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ (12), హార్డిక్ పాండ్యా (23), జడేజా… -
విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
టీ20 క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. శుక్రవారం ఆప్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 51 పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20ల్లో ఓవరాల్గా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆడిన 26వ ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. గతంలో విరాట్ కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో వెయ్యి పరుగులు సాధించి రికార్డు సృష్టించగా..… -
కోహ్లీ నిరాశపరిచాడు అంటున్న జడేజా…
గత ఆదివారం భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ చేసిన కొన్ని వ్యాఖ్యలతో నేను నిరాశ చెందాను అని భారత ఆటగాడు అజయ్ జడేజా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో మేము మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోవడం తమను వెనక్కి లాగింది అని చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలు నన్ను నిరాశపర్చాయి. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నపుడు ఆ… -
ఆసక్తి రేపుతున్న కొత్త యాడ్.. పంత్ను టీజింగ్ చేసిన విరాట్ కోహ్లీ
పాకిస్థాన్తో మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా దృష్టి తరువాతి మ్యాచ్పై పడింది. ఈనెల 31న ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ సరికొత్త యాడ్ రూపొందించింది. ఈ ప్రకటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను టీజింగ్ చేశాడు. కోహ్లీకి పంత్ ఫోన్ చేసి.. ఈ మ్యాచ్లో గెలవాలంటే తనకు కొత్త ఆలోచన వచ్చిందని చెప్తాడు. న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో వికెట్ పడిన ప్రతీసారి తాను… -
అతి విశ్వాసమే భారత్ కొంపముంచిందా…?
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ పై ఉన్న అజేయ రికార్డు చెరిగిపోయింది. కోట్లాది మంది హృదయాలను బద్దలు చేస్తూ.. టీమిండియా చెత్తగా ఆడి.. చిత్తుగా ఓడిపోయింది. ఓటమి కంటే ఓడిన తీరే ఎక్కువ బాధిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాక్ తో మ్యాచ్ లో టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు. పసలేని ఆట, వ్యూహాత్మక తప్పిదాలు తీవ్రంగా దెబ్బతీశాయి. అసలు టీమిండియా గేమ్ ప్లాన్ ఎక్కడ ఫెయిలైంది..? పాక్ ను తక్కువగా అంచనా వేశారా..? అతి… -
పాకిస్థాన్ ఆటగాళ్లు అందరూ ధోని అభిమానులే…
భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లు నాదరూ కెప్టెన్ విరాట్ కోహ్లీని అలాగే ధోనిని కలిసిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే దీని పై పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ… ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లు అందరూ విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానులు అని, అందుకే నిన్న మ్యాచ్ తర్వాత వారు కోహ్లీ, ధోనిని కలిశారు అని అన్నారు. ఇక భారత్, పాక్ ఆటగాళ్ల… -
అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ
నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం… -
అంచనాలు తలకిందులు.. భారత్కు కాళరాత్రి చూపించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచకప్లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు.… -
పొట్టి ప్రపంచ కప్ లో కోహ్లీ అరుదైన రికార్డ్స్…
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో త్వరగా వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఒక్క హాఫ్ సెంచరీతో రెండు రెసిర్డులు తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. ఈ టీ20 ప్రపంచ కప్ లో అర్థ శతకం బాదిన మొదటి భారత… -
ఆదుకున్న కోహ్లీ… పాక్ ముందు 152 పరుగుల టార్గెట్
టీ20 ప్రపంచకప్లో సూపర్-12లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 20 ఓవర్లకు 151/7 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ ముందు 152 పరుగుల టార్గెట్ నిలిచింది. బౌలింగ్ పిచ్ కావడంతో ఆరంభంలో పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత ఓపెనర్ రోహిత్ డకౌట్ కాగా మరో ఓపెనర్ రాహుల్ 3 పరుగులకే వెనుతిరిగాడు. ఈ రెండు వికెట్లు షహీన్ షా అఫ్రిదికే దక్కాయి. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (13)…
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!