ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారు. బాలికపై బండరాయితో మోది హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది మైనర్ బాలిక. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం బాలికను వివస్త్రను చేసి హత్య, అత్యాచారానికి పాల్పడినట్లు…
ఎండ ప్రచండ కిరణాలనుంచి హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, ఈరోజు 0830 గంటల IST సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర…
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో…
ఈ సృష్టిలో తీయనైనది ప్రేమ. అది ఎవరి మధ్య అయినా పుడుతుంది. దానికి రంగు, కులం, మతంతో సంబంధం లేదు. అలా ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా పుట్టింది. దీంతో ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇది జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణలో. తెలంగాణలో తొలిసారిగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించారు. Read Also: వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం వివరాల్లోకి వెళ్తే.. 8 ఏళ్ల క్రితం…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ‘భీమ్లా నాయక్’ పై పూర్తిగా దృష్టి సారించాడు. సాగర్ చంద్ర దర్శకుడు కాగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ‘భీమ్లా నాయక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా…
వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో తీవ్రం ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు మృతి చెందడంతో శవంతో డ్రైవర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15మంది ఓ వ్యాన్ లో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున పువ్వులు తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతీరెడ్డి పల్లి గేటు దగ్గర టైర్ పేలీ వ్యాన్ బొల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ…
హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల్లో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ తుపాకుల మోత మోగుతూనే వుంటుంది. అనంతగిరి కొండల్లో ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం వేటగాళ్లు తుపాకులకు పని చేపు తునే ఉన్నారు. అనంతగిరి కొండలు పర్యాటక కేంద్రం కావడంతో అక్కడ నిత్యం ఏదో ఒక సందడి ఉంటుంది. అయితే కొంత మంది వేటగాళ్లు స్వేచ్ఛగా అక్కడ హంటింగ్ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆగడాలు…
ఆ అధికారి రూల్ ప్రకారం వెళ్లారు. అది అధికారపార్టీ ఎమ్మెల్యేకు నచ్చలేదు. పైగా తన పుట్టలోనే వేలు పెట్టడంతో రాత్రికి రాత్రే ఆ ఆఫీసర్ను బదిలీ చేయించేశారట. పైగా ఇదంతా లోకల్ ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం విశేషం. దానిపైనే ఇప్పుడు టీఆర్ఎస్తోపాటు.. అధికారుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలు వికారాబాద్ జిల్లలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారిపై సడెన్గా బదిలీవేటు పడటం టీఆర్ఎస్తోపాటు రాజకీయ వర్గాల్లో…
నిత్యం ఏదో ఒక సమస్య. ఒకటి కొలిక్కి వస్తే.. ఇంతలోనే మరో ఇబ్బంది. రాజకీయంగా ప్లస్లో పడ్డామన్న సంతోషం క్షణకాలమైన ఉండటం లేదట ఆ ఎమ్మెల్యేకు. ఆనందం ఆవిరైపోతోందట. ఇంతకీ ఎమ్మెల్యేకు వచ్చిన సమస్యేంటి? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! ఆనంద్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్థానిక నేతలు ఫోకస్! మెతుకు ఆనంద్. వృత్తిరీత్యా డాక్టరైన ఆనంద్.. రాజకీయాలపై ఆసక్తితో టీఆర్ఎస్లో చేరి.. 2018 ముందస్తు ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో…
వికారాబాద్ జిల్లాలో పరిగిలో రైతులు ఆంధోళనలకు దిగారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డు మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. పండించిన వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధోళనలు చేస్తున్నారు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై రైతులు బైఠాయించారు. రోడ్డుపై రాళ్లు పెట్టి వాహనాలను ఆపేశారు. దీంతో దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. కలెక్టర్ వచ్చి స్ఫష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం…