పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ‘భీమ్లా నాయక్’ పై పూర్తిగా దృష్టి సారించాడు. సాగర్ చంద్ర దర్శకుడు కాగా రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తన పార్ట్ షూట్ పూర్తి చేసుకున్నాడు. ‘భీమ్లా నాయక్’ చివరి షెడ్యూల్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వారం రోజుల్లో పెండింగ్లో ఉన్న పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు.
Read Also : ‘పుష్ప’రాజ్ పై సైబరాబాద్ పోలీస్ హిలేరియస్ మీమ్… ‘తగ్గేదే లే’!
ఈ షెడ్యూల్తో ‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తి చేయగా, ఆపై క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ జరుపుకోవడానికి పవన్ రష్యాకు వెళ్లనున్నారు. ఆయన జనవరి మొదటి వారంలో భారతదేశానికి తిరిగి వస్తాడు. ఆపై ‘భీమ్లా నాయక్’ ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా వాయిదాపై చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021