పీరంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. డ్రైవర్ ఇంటిముందు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో తీవ్రం ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు మృతి చెందడంతో శవంతో డ్రైవర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15మంది ఓ వ్యాన్ లో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున పువ్వులు తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతీరెడ్డి పల్లి గేటు దగ్గర టైర్ పేలీ వ్యాన్ బొల్తాకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆ వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓలీవ్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. గాయపడిన వారిలో బందెయ్య, యాదయ్య అనే ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో బంధువులు ఆగ్రహంతో బందెయ్య శవాన్ని ఆసుపత్రి నుంచి డ్రైవర్ ఇంటికి తీసుకెళ్లి ఇంటిముందు శవాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. బందెయ్య కుంటుంబానికి న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!