అనంతగిరి కొండల్లో ఆగని తుపాకుల మోత…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న అనంతగిరి కొండల్లో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ తుపాకుల మోత మోగుతూనే వుంటుంది. అనంతగిరి కొండల్లో ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం వేటగాళ్లు తుపాకులకు పని చేపు తునే ఉన్నారు. అనంతగిరి కొండలు పర్యాటక కేంద్రం కావడంతో అక్కడ నిత్యం ఏదో ఒక సందడి ఉంటుంది. అయితే కొంత మంది వేటగాళ్లు స్వేచ్ఛగా అక్కడ హంటింగ్ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరొకసారి వికారాబాద్లోని అనంతగిరి కొండల్లో అర్ధరాత్రి సమయంలో తుపాకుల మోత వినిపించింది.
తుపాకుల మోతలు.. మందుబాబుల ఆగడాలతో అనంతగిరి అడవుల్లో అలజడులతో నిత్యం జనం జంకుతున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి నిత్యం పర్యాటకుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంది. హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా అనంతగిరి అడవులు, కొండ కొనలు, చెరువులు ఉండడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ పర్యాటక కేంద్రాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది మందుబాబులు రెచ్చిపోతున్నారు. అడవిలో ఎక్కడ బడితే అక్కడ తాగిపడేసిన సీసాలు…వ్యర్ధ పదార్ధాలతో కనిపిస్తోంది. అనంతగిరి చూట్టూ పదుల సంఖ్యలో రిసార్ట్స్ లు ఉండడంతో వాటిలో రాత్రి బస చేసేందుకు వస్తున్న యాత్రికులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అడవుల్లో పర్యటనకోసం వచ్చే కొంతమంది బడానాయకుల పిల్లలు తమవెంట తూపాకు తీసుకొచ్చి రాత్రి సమయంలో హంటింగ్ (వేట) కోసం అడవుల్లో తిరుగుతూ గన్ లో శబ్దంతో మారుమోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాలపై స్థానికులు అటవిశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అటవిశాఖ అధికారులకు పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో గాని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో మాత్రం చూపడంలేదని ఇక్కడి పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అడవుల్లో వేసే వ్యర్దాలను తింటు, ఓవర్ స్ఫిడ్ తో వెళ్తున్న వాహనాలు తగిలి నిత్యం వణ్యమృగాలు మృత్యువాత పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ అడవి ప్రాంతంలో నుంచి రహదారిలో గ్రామాల ప్రజలు ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని జంకుతున్నారు. గతంలో వికారాబాద్ జిల్లా లో వేట వాళ్ల బారిన పడి ఎన్నో మూగజీవాలు మృత్యు వాతపడిన ఘటనలు ఉన్నాయి. అనంతగిరి అడవుల్లో జరుగుతున్న కార్యకలాపాలపై స్పందించేందుకు అటవిశాఖ, పోలీస్ శాఖ అధికారులు స్పందించేందుకు ఇష్టపడడం లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనంతగిరిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
: Ramesh Vaitla
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..