Vijayawada Medical Student Dies in Chicago: ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. విజయవాడకు చెందిన వైద్య విద్యార్థిని కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కారులో గ్యాస్ లీక్ అవ్వడంతో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. యువతి మరణంతో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది. వివరాల మేరకు.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్…
న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు శ్రీనివాస్ రెడ్డి బదులు డ్రైవర్ వెళ్ళటంతో న్యాయమూర్తి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలివుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం అయ్యేలా…
విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామని.. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చాం.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తాం.. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నాం.. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని
కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా వస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండంతో నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ వరద నీరంత ప్రస్తుతం కృష్ణా నదిలోకి వచ్చి చేరడంతో నీటి ప్రవాహం గంట, గంటకు పెరుగుతుంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం జగన్ కు వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు నృత్యాలతో పిల్లలు, నాట్యకారులు అలరించారు. అలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేశారు.