YSRCP vs TDP: ఈసీ ఎదుట టీడీపీ-వైసీపీ పంచాయితీ.. పోటా పోటీ ఫిర్యాదులు
YSRCP vs TDP: ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ పోటీగా ఫిర్యాదులు చేశారు రెండు పార్టీల నేతలు.. ఇప్పుడు రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు వైసీపీ-టీడీపీ, జనసేన పార్టీల నేతలు.. దీంతో.. విజయవాడ వేదికగా ఎన్నికల కమిషన్ ముందు వైసీపీ-టీడీపీ పంచాయితీగా మారింది పరిస్థితి.. ఓట్ల తొలగింపు మీద పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు అధికార, విపక్ష నేతలు..
Read Also: Vivek Bindra Controversy: పేరుకు పెద్ద మోటివేషన్ స్పీకర్.. పెళ్లైన కొన్ని గంటలకే భార్యపై గృహ హింస
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను టీడీపీ, జనసేన నేతలు కలిశారు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, బోండా ఉమా.. జనసేన నేతలు గాదె వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు నేతలు సీఈసీ ప్రతినిధులను కలిశారు.. రాష్టంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు. మరోవైపు.. వైసీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు.. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, అబ్బయ్య చౌదరి తదితరులు ఎన్నికల అధికారులను కలిసిన వారిలో ఉన్నారు.. వారు కూడా ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు.
Read Also: Kannappa: న్యూజిల్యాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప.. మోహన్ బాబు ట్వీట్ వైరల్
కాగా, గతంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్లో 40.76 లక్షలకు పైగా దొంగ ఓట్లు జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు రాష్ట్రంలో కూడా నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, కక్ష పూరితంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు.. వైసీపీ నేతలే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ టీడీపీ కూడా పలు సందర్భాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!