ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంది. పది మందిని సన్మార్గంలో నడిపించాల్సిన పండితులమ్మ బుద్ధిహీనురాలిలా ప్రవర్తించింది. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణించాల్సిన ఆమె.. దర్జాగా ఏసీ కోచ్లో కూర్చుని జర్నీ చేస్తోంది. టికెట్ చూపించమన్న పాపానికి టిక్కెట్ కలెక్టర్ వేధిస్తున్నాడంటూ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతడో రౌడీషీటర్. ఓ హత్య కేసులో బెంగళూరులోని పరప్పన్ అగ్రహార్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇక జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. నిత్యం ప్రహారా ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఓ రౌడీషీటర్ గ్రాండ్గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రో రెజ్లింగ్ అరేనాగా మారింది. ఇద్దరు ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్కు దిగారు. కిక్కిరిసి వెళ్తున్న కోచ్లో సడన్గా ఇద్దరు ప్యాసింజర్స్ కొట్లాటకు దిగారు. ఇద్దరూ కూడా ఒకకినొకరు తన్నుకోవడం.. కొట్టుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రథమ మహిళ మెలానియా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చర్చించుకుంటున్నారు.
నిర్లక్ష్యం కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంటుంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్లో జరిగిన సంఘటనే ఉదాహరణ. పిట్టగోడ దగ్గర నిలబడిన వ్యక్తి అమాంతంగా రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక అమెరికా ప్రజలు కన్నీటిపర్యంతం అయ్యారు.
అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్లిన కొంత మంది భారతీయ మహిళలు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. జూలైలో ఓ స్టోర్లో దొంగతనం చేస్తూ భారతీయ మహిళ రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది.
జమ్మూకాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రికార్డ్ స్థాయిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అన్ని వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇక దోడాలోని భలీసా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా కాలువలు పొంగిపొర్లాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటుంటారు. అంటే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండాలని చెబుతుంటారు.
చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పలు నగరాలు అతలాకుతలం అయ్యాయి. వస్తువులు, కార్లు కొట్టుకుపోయాయి. అలాగే ఒక నగల షాపును కూడా భారీ వరద ముంచెత్తింది.