Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు.
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహా రెడ్డి' చిత్రం వందరోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకను చిత్ర బృందం సమక్షంలో హిందూపురంలో ఈ నెల 23న నిర్వహించబోతున్నారు.
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఫిబ్రవరి 10న వస్తున్న 'అమిగోస్' కూడా హిట్ అయితే... ఈ సంస్థకు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ లభించినట్టే!!
కొత్త సంవత్సం మొదటి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విజయంతో ఈ యేడాదికి శుభస్వాగతం లభించినట్టుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
ఈ యేడాది ఆరంభంలోనే టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ చిత్రాలతో 'వీర' అన్న పదానికి ఓ క్రేజ్ తీసుకు వచ్చారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' రెండూ సంక్రాంతి కానుకలుగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నాయి.
ఓ వైపు అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమా వెలుగులు విరజిమ్ముతూ 'ట్రిపుల్ ఆర్' బృందం విజయ విహారం చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం తెలుగువారికే తలవంపులు తెచ్చేలా వినలేని మాటల యుద్ధంతో తమ హీరోల సినిమాలకు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటి దాకా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఈ యేడాది పొంగల్ కు చిరు, బాలయ్య మధ్య సాగిన పోటీ తొమ్మిదోసారి!
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.