Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..
- భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..
- ఒక్కసారిగా పెరిగిన స్టాక్స్ కొనుగోళ్లు..
- 5 శాతం మేర తగ్గిన ఇండియా విక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు (మార్చి 16) భారీ లాభాలతో ముగిసింది. గత మూడు రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు, ఈరోజు కోలుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్.. 938.93 పాయింట్లు (1.26 శతం) పెరిగి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ.. 257.70 పాయింట్లు (1.11 శాతం) లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ఈరోజు 1,410 షేర్లు లాభపడగా.. 2,772 షేర్లు నష్టపోయాయి. 157 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) 2.9 శాతం పెరిగింది. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా 1 శాతం మేర లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ ఏకంగా 4.22 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, ఎస్బీఐ కూడా మంచి లాభాలను సాధించాయి. ఇక సన్ ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.
Also Read:Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
మార్కెట్ పుంజుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు. గత కొన్ని రోజులుగా మార్కెట్లు పడిపోవడంతో.. మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు వాటిని కొనేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎమ్సీజీ రంగాల షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. మార్కెట్లో ఆందోళనను సూచించే ‘ఇండియా విక్స్’ (VIX) 5 శాతం మేర తగ్గింది. ఇది మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి తగ్గుతుందని చెప్పడానికి ఒక సంకేతం. అయితే మార్కెట్లో ఇంకా కొంత ఒడుదొడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Also Read:Free Urea: తెలంగాణ రైతులకు అదిరే శుభవార్త.. ఉచితంగా యూరియా పంపిణీ..!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. సముద్ర మార్గంలో చమురు రవాణాకు ఆటంకం కలగకుండా దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయన్న వార్త మార్కెట్కు బలాన్నిచ్చింది. మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలు (శివాలిక్, నందాదేవి) క్షేమంగా భారత్కు వస్తుండటం ఇంధన సరఫరాపై ఆందోళనలను తగ్గించింది. మార్కెట్ ఈరోజు పెరిగినప్పటికీ.. టెక్నికల్గా చూస్తే నిఫ్టీ 23,500 పైన స్థిరపడితేనే మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మార్కెట్ మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తే 22,800 స్థాయి వరకు వెళ్లే ప్రమాదం ఉందని కోటక్ సెక్యూరిటీస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారం నిఫ్టీ 22,000 నుంచి 24,000 మధ్య ట్రేడ్ కావచ్చని అంచనా.
తాజావార్తలు
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!