వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే బరిలో టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ ఉండటమే. చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి' రెండూ బాక్సాఫీస్ బరిలో కొదమసింహాల్లా పోటీ పడనున్నాయి.
VeeraSimha Reddy : నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'లోని ఫస్ట్ సింగిల్ ముహూర్త సమయానికి నవంబర్ 25 ఉదయం 10 గంటల 29 నిమిషాలకు అభిమానులను పలకరించింది.