Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది వారణాసి కోర్టు. హిందూ పక్షం తరుపు మసీదులోని వాజూఖానాలో బయటపడిన శివలింగానికి శాస్త్రీయ పరిశోధన జరగాలని.. కార్బన్ డేటింగ్ జరిపించాలని కోరుతూ కోర్టును కోరారు. అయితే శుక్రవారం రోజూ హిందూ పక్షం డిమాండ్ ను వారణాసి కోర్టు తిరస్కరించింది. హిందూ సంఘాల తరుపున వాదిస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
ఇటీవల పశువులను ఢీకొన్న ఘటనలతో వార్తల్లో నిలిచిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడు రైలు డ్యామేజ్ అయితే తాజాగా రైలు చక్రాల వద్ద సమస్య వచ్చింది. ఇటీవల ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైలుకు రోజుకొక కష్టం వచ్చిపడుతోంది
Hindu Side Moves Plea Seeking Carbon Dating Of 'Shivalinga': జ్ఞానవాపి మసీదు కేసులో గురువారం వారణాసి కోర్టులో కీలక వాదనలు జరిగాయి. హిందూ పక్షం న్యాయవాది విష్ణు జైన్, జ్ఞానవాపి మసీదులో ఉన్న శివలింగానికి ‘కార్బన్ డేటింగ్’చేయాలని శివలింగంగా చెబుతున్న ఆకారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వారణాసి జిల్లా కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
Muslim couple married in Hindu style: భారత పర్యటనలో ఉన్న ఓ అమెరికన్ ముస్లిం జంట హిందూ సంప్రదాయాలకు ఫిదా అయ్యారు. అప్పటికే ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్న వీరిద్దరు మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిద్దరికి నిఖా జరిగిన 18 ఏళ్ల తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు.
ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యూపీలో రూ.1800 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి వారణాసిలో పర్యటించారు. వారణాసిలో అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో ప్రసంగిస్తూ మోదీ కొత్త జాతీయ విద్యా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానం ప్రాథమిక లక్ష్యం విద్యను సంకుచిత ఆలోచన ప్రక్రియ పరిమితుల నుంచి బయటకు తీసుకురావడమే అని ఆయన అన్నారు. 21వ…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును జూలై 4కు వాయిదా వేసింది. దీంతో…