Akhilesh Yadav: గంగా విలాస్ కొత్తదేం కాదు.. 17 ఏళ్ల పాతది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav Controversial Comments On Ganga Vilas: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే! దీనిపై తాజాగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నౌక కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూనే ఉందని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు అందులో మద్యం అందుబాటులో ఒక బార్ని కొత్తగా తెచ్చారని ఆరోపణలు చేశారు. పాతవాటిని మళ్లీ కొత్తగా ప్రారంభించే సంప్రదాయం బీజేపీకే చెల్లిందని కౌంటర్ వేశారు. అందులో బార్ ఉందో? లేదో? అనే విషయంపై బీజేపీనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..
Also Read
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
- NALSAR: "CJI సూర్యకాంత్ చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోం".. నల్సార్ యూనివర్సిటీ వివాదం..
- Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
రాయ్బరేలీలో మీడియాతో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఆ గంగా విలాస్ గత 17 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఈ విషయాన్ని నాకు కొందరు తెలియజేశారు. దానికి కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేసి.. ఏదో కొత్త నౌకను లాంచ్ చేసినట్టు దాన్ని మేము ప్రారంభించామని బీజేపీ వాళ్లు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. ఎంతో పవిత్రమైన గంగా నదీలో ప్రయాణించే ఆ నౌకలో ఇప్పుడు మద్యం అందించే బార్లు కూడా ఉన్నట్లు నాకు సమాచారం అందింది. ఇప్పటివరకు గంగాలో హారతి మాత్రమే ఇస్తారని మనం వినేవాళ్లం. మరి ఆ నౌకలో బార్ ఉందో లేదో బీజేపీ వాళ్లే స్పష్టం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.
Bala Murugan : రచయిత బాలమురుగన్ కన్నుమూత
కాగా.. ఎన్నో అధునాతన సౌకర్యాలతో నిర్మితమైన ఈ గంగా విలాస్ వారణాసిలోని గంగా హారతితో మొదలై బిహార్లోని విక్రమశిల యూనివర్సిటీ, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ డెల్టా, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను చుట్టుముట్టి అస్సాంలోని దిబ్రుగార్కి చేరుకుంటుంది. 51 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో భాగంగా ఈ నౌక 3200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఇందులో ఒక్కొక్కరికి రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే.. ఇందులో కేవలం 36 మంది పర్యాటకులు మాత్రమే ప్రయాణించే వీలుంది. ఆల్రెడీ ఈ నౌకా ప్రయాణానికి 2024 ఏప్రిల్ వరకు బుకింగ్లు పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్రౌండర్లు ఒకేసారి అవుట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!