Muslim couple married in Hindu style: భారత పర్యటనలో ఉన్న ఓ అమెరికన్ ముస్లిం జంట హిందూ సంప్రదాయాలకు ఫిదా అయ్యారు. అప్పటికే ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్న వీరిద్దరు మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిద్దరికి నిఖా జరిగిన 18 ఏళ్ల తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు.
ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. యూపీలో రూ.1800 కోట్ల విలువైన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి వారణాసిలో పర్యటించారు. వారణాసిలో అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో ప్రసంగిస్తూ మోదీ కొత్త జాతీయ విద్యా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానం ప్రాథమిక లక్ష్యం విద్యను సంకుచిత ఆలోచన ప్రక్రియ పరిమితుల నుంచి బయటకు తీసుకురావడమే అని ఆయన అన్నారు. 21వ…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణ సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. ఐదుగురు మహిళలు జ్ఞానవాపి మసీదులోని దేవతామూర్తులకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదాన్ని వారణాసి జిల్లా కోర్టులో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 30న ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు కేసును జూలై 4కు వాయిదా వేసింది. దీంతో…
జ్ఞానవాపీ మసీదు వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఐదుగురు మహిళలు జ్ఞాన్వాపి మసీదు పశ్చిమ గోడ వెనుక భాగంలో ఉన్న శృంగార్ గౌరీ, గణేశ, హనుమంతుడు పూజలకు అనుమతి ఇవ్వాలని కోరడంతో వారణాసి కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశించింది. మే 14-16 తేదీల్లో కోర్ట్ కమిషనర్ల ఆధ్వర్యంలో వీడియో సర్వే చేశారు. అయితే వీడియో సర్వేను నిలిపి వేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంను ఆశ్రయించింది అయితే.. సుప్రీం కోర్ట్ ఈ కేసును వారణాసి జిల్లా…
జ్ఞాన్వాపి మసీదు వివాదం కొత్తది కాదు. చాలా కాలంగా నడుస్తున్నదే. ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోందో తెలుసుకోవాలి. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం చేశారు. 1991లో అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం సాగుతున్న సమయంలో అంటే, అద్వానీ రథయాత్ర, యూపీలాంటిచోట్ల మతరపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న రోజుల్లో, 1991 సెప్టెంబర్ 18న నాటి పివి…
జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన…