ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయాయి. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్నది. శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఆహారం, ఉద్యోగ సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆఫ్ఘన్ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. శీతాకాలంలో ఈ వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో తాలిబన్…
కరోనా సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం దొరుకుతున్నది. ఈ సమయంలో రెండు సమస్యలు ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. అందులో ఒకటి ఆఫ్ఘన్ సమస్య ఒకటి కాగా, రెండోది తైవాన్ సమస్య. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజల పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. రెండు దశాబ్ధాలు అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడి సైనికులకు కావాల్సిన శిక్షణను అందించినా లాభం లేకుండా పోయింది. ఈ సమస్య తరువాత తైవాన్ సమస్య ఇప్పడు ప్రపంచంలో కీలకంగా మారింది. ఆర్థికంగా…
ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి సెటిల్ కావాలని కలలు కంటుంటారు. అక్కడ అవకాశాలు, జీతాలు, జీవితాలు అలా ఉంటాయి. అయితే, 2000 సంవత్సరం తరువాత ప్రపంచ ఆర్థిక ప్రగతి ఒక్కసారిగా మారిపోయింది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మౌళిక సదుపాయాల రంగం అభివృద్ధి చెందడంతో ప్రపంచ సంపద భారీగా పెరిగింది. 2000 వ సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ సంపద 2020 వ సంవత్సరానికి వచ్చేసరికి 514 ట్రిలియన్ డాలర్లకు చేరింది. Read: భూమిపై…
అమెరికా.. చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆసియా ఖండంలో ఆధిపత్యం చలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా ఆర్థికంగా వేగంగా అభివృద్దిచెందింది. అప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి చైనా ఎదిగింది. ఆర్థిక ఎదుగుదలతో పాటుగా చైనా విస్తరణపై దృష్టి సారించడంతో సరిహద్దు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే టిబెట్, హాంకాంగ్పై పట్టు సాధించిన చైనా దృష్టి తైవాన్పై పడింది. వన్ చైనాలో…
ఒకప్పుడు అమెరికా… రష్యా దేశాల మధ్య కోల్డ్ వార్ నడిచింది. రష్యా విచ్చిన్నం తరువాత అమెరికా అగ్రదేశంగా చలామణి అవుతూ వస్తున్నది. అయితే, స్పేస్ రంగంలో ఇప్పటికీ రెండు దేశాల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొని ఉన్నది. రెండు దేశాలు పోటాపోటీగా ఆయుధాలను తయారు చేసుకోవడంతో పాటు, అత్యాధునిక ఆయుధాలను వివిధ దేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాయి. Read: హోండా యాక్టివాపై 117 చలానాలు… యజమాని అరెస్ట్… రష్యా ఓ అడుగు ముందుకు వేసి…
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు పెద్ద వ్యాపారి. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ ఇలా ఎన్నో బిజినెస్ రంగాల్లో సక్సెస్ సాధించాడు. అమెరికాలో ఆయనకు అనేక హోటల్స్ ఉన్నాయి. అయితే, వాషింగ్టన్లోని అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ నష్టాల బాట పట్టింది. దాదాపు 70 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటకట్టుకుంది. 2016 లో ఈ హోటల్ను తీసుకున్న ట్రంప్ మూడేళ్లపాటు సక్సెస్గా రన్ చేశారు. Read: ఫలించని…
మనదగ్గర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్తో పాటుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమోటా 40 వరకు పలుకుతున్నది. టమోటాతో పాటుగా మిగతా కూరగాయల ధరలు కూడా అలానే ఉన్నాయి. అయితే, మనదగ్గర టమోటా రూ.40 వరకు ఉంటే అమెరికాలు రెండు పౌండ్ల టమోటా (కిలో) ఏకంగా రూ.222 ఉన్నది. ఒక్క టమోటా మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా ఉన్నాయి. కిలో క్యారెట్ రూ.163, కిలో వంకాయలు రూ.444,…
సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది. రాకెట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇతర గ్రహాలమీదకు వెళ్లేందుకు మనిషి ప్రయత్నిస్తున్నాడు. త్రీడీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి అవసరమైన సాధనాలను తయారు చేసుకుంటున్నాడు. మనిషి ఎన్ని సాధించినా నివశించాలి అంటే ఇల్లు ఉండాలి. ఒక ఇంటిని నిర్మించాలి అంటే ఎంత సమయం, ఖర్చు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. సమయాన్ని, ఖర్చును తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న 3డీ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాడు. Read: రాష్ట్రపతికి అరుదైన గౌరవం… చీరకొంగుతో…
సోషల్ మీడియా ఎంటర్టైన్ మెంట్ యాప్ లు కేవలం ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రమాదాల నుంచి కూడా కాపాడుతున్నాయి. ఇటీవలే కిడ్నాపైన యువతిని టిక్టాక్ వీడియో కాపాడింది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని నార్త్ కరోలీనాలో 16 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తున్నారు. అయితే, నార్త్ కరోలీనాలో కిడ్నాప్కు గురైన యువతిని దుండగులు కెంటకీ తీసుకొచ్చారు. కారులో ఉన్న ఆ యువతి బయట…