Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తాను ఇరాన్తో చర్చలు జరుపుతున్నానని, యుద్ధాన్ని త్వరగా ముగించడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇటీవల పేర్కొన్నారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ గందరగోళం నడుమ అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రకటన చేశారు. కొంతమంది ఇరానీయులు తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. తాను నవ్వి, “నేను నిరాకరించాను. ప్రపంచంలో ఏ…
మధ్యప్రాచ్యంలో యుద్ధం అత్యంత భయంకరమైన , ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లోని నతాన్జ్ అణు కేంద్రం, ఇజ్రాయెల్లోని దిమోనా అణు సదుపాయం ఉన్న నగరంపై దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తోందని, ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి…
Iran warns of attacks on US: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అమెరికాకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పేసింది.. అమెరికా మిత్ర దేశాలపైనా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేసింది.. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్ధృతంగా మారింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రపంచ మార్కెట్లకు చమురు చేరే ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా టెహ్రాన్ పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ పవర్ ప్లాంట్స్ను నాశనం చేస్తానని హెచ్చరించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ జలసంధిని సురక్షితం చేయాలని ట్రంప్పై స్వదేశంలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. "ఈ క్షణం నుంచి సరిగ్గా 48 గంటలు టైమ్ ఇస్తున్నాం. ఇరాన్…
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు ఎక్కడుందో ఎవరికీ తెలియదు..అయితే గెలుపును మాత్రం ఎవరికి వారు ఓన్ చేసుకుంటున్నారు. అమెరికా తన విజయాన్ని ప్రకటించుకుంటోంది. ఇజ్రాయెల్ తమ దాడులు ఫలించాయని చెబుతోంది.. ఇరాన్ మాత్రం ఇంకా నిలబడే ఉన్నామని గర్వంగా చెబుతోంది..! ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు.. ఇంతకి అసలు నిజం ఏంటి? ఇప్పుడీ యుద్ధంలో నిజంగా ఎవరు ముందంజలో ఉన్నారు? ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు మూడో వారంలోకి వెళ్లింది. మొదటి దశలో…
Mojtaba Khamenei: ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించి మరింత భీకరంగా మారుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా పగ్గాలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, తన మొదటి విదేశాంగ విధాన ఉత్తర్వులోనే నిప్పులు చెరిగారు. శాంతి చర్చలకు తావులేదని, శత్రు దేశాలు బేషరతుగా లొంగిపోతేనే యుద్ధం ఆగుతుందని ఆయన ఈ ఉత్తర్వులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి అందుతున్న అన్ని కాల్పుల విరమణ ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీ…
USA: అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోతే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని హత్య చేయడానికి వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని వదులుకోవాలనేది యూఎస్ ప్రధాన డిమాండ్.
Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా తన ఫైటర్ జెట్స్, బాంబర్స్, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులతో ఇరాన్ను టార్గెట్ చేసుకుంటుందని ప్రకటించారు.
ఇరాన్ ప్రతికార దాడులకు దిగితే, మేం గట్టిగా జవాబిస్తాం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ పేర్కొన్నారు. ఇక, మేము టెహ్రాన్ సైన్యాన్ని, ప్రజలను టార్గెట్ చేయలేదు.. ఓన్లీ అణు స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని తెలిపారు.