US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
- ఇరాన్పై అమెరికా దాడులు
- హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమన్ తీరంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన అనంతరం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై లక్ష్యిత సైనిక దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ చర్యను అమెరికా అధికారులు స్వీయ రక్షణ దాడులుగా పేర్కొన్నారు. ఇరాన్ చేసిన దురాక్రమణకు ఇది తగిన సమాధానమని యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
అమెరికా సైనిక వర్గాల సమాచారం ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున హర్ముజ్ జలసంధి సమీపంలో అపాచీ హెలికాప్టర్ కూలిపోయింది. ఘటన అనంతరం ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టగా, వారిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ, ఇద్దరు పైలట్లు సుమారు రెండు గంటల పాటు సముద్రంలో ఉన్నారని తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా సైన్యం పేర్కొంది.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు ట్రంప్, అమెరికా సైనిక ఆస్తులపై జరిగే దాడులను సహించబోమని హెచ్చరించారు. “ఈ దాడికి బలమైన ప్రతిస్పందన ఉంటుంది” అని ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాబోయే వారాల్లో అమెరికా తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధిస్తుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, టెహ్రాన్తో కొత్త అణు ఒప్పందానికి అవకాశాలు ఉన్నాయని, చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని తెలిపారు.
ఒక ఎన్నికల టెలి-ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్, “చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఒక మంచి ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోంది. అణ్వాయుధాలు లేకుండా ఉండే ఒప్పందం కోసం వారు చర్చలకు సిద్ధంగా ఉన్నారు” అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుండగా, హర్ముజ్ జలసంధిలో పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!