యూపీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. జనవరి 6 వ తేదీ నుంచి జనవరి 14 వరకు సెలవులు ప్రకటించింది. యూపీలో యాక్టీవ్ కేసులు 3 వేలు దాటటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ సమయాన్ని కూడా ప్రభుత్వం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉన్న కర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించింది. రాట్రి 10…
యూపీలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ సొంత నియోజక వర్గంలో డైరీ, విద్య, ఆరోగ్యం వంటి 22 రకాల ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో పశువుల పోషణకు గర్వ పడుతున్నానని, కాని కొందరు మాత్రం దానిని పాపంగా పోలుస్తున్నారని అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు పశువులపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి పశువులపై జోక్ వేయడం మంచిది కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.…
యూపీలో ఎన్నికల వేడి రగులుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్కు కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా…
దేశంలో మరో పెద్ద ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యూపీలో ఇప్పటికే యమునా ఎక్స్ప్రెస్ వే ఉండగా, మరో ఎక్స్ప్రెస్ వే ను నిర్మించేందుకు సిద్ధమయింది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 464 కిమీ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును అదానీ ఎంటర్ప్రైజస్ దక్కించుకుంది. ఇందులో భాగంగా తొలిదశకింద బుధౌన్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టు విలువ రూ. 17 వేల కోట్లు. పీపీపీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. Read:…
మరికాసేపట్లో పెళ్లి అనగా ఏదో కారణం చేత పెళ్లిళ్లు ఆగిన సంగతులు చూశాం. నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అయితే, పెళ్లి తంతు అంతా బాగా జరుగుతున్న సమయంలో పెళ్లి మండపంలోకి మాజీ ప్రియుడు వచ్చి గలాటా చేయడం వలన పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని హర్పూర్లో ఓ పెళ్లి మండపంలో వివాహం జరుగుతున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడు దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ…
వచ్చే ఏడాది దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది బీజేపీ. దీనికోసం పావులు కదుపుతున్నది. ఎలాగైనా మెరుగైన స్థానాల్లో విజయం సాధించి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. అటు బీఎస్పీ కూడా పావులు కదుపుతోంది. అయితే, దేశంలో ముస్లీం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న పార్టీల్లో ఒకటి ఎంఐఎం ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ లో…
ప్రధాని మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించబోతున్నారు. భారత్ వాయుసేనకు చెందిన సీ 130 జె సూపర్ హెర్క్యులస్ విమానంలో ఎక్స్ప్రెస్ వే పై దిగనున్నారు. అనంతం ఎక్స్ప్రెస్వేను జాతికి అంకితం చేస్తారు. 340 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిపై అక్కడక్కడా వాయుసేన విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యేందుకు అనుగుణంగా సిమెంట్ వే లను నిర్మించారు. Read: నవంబర్ 16, మంగళవారం దినఫలాలు… ఆదివారం రోజున…
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం అతనిది. రోజూ రిక్షాతొక్కి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో ఇళ్లు గడుపుకుంటూ కొంత సొమ్మును బ్యాంకులో పొదుపు చేసుకుంటున్నాడు. ఇలాంటి రిక్షావాలాకు ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించారు. రూ.3.47 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించాలని నోటీసులు పంపారు. దీంతో పాపం ఆ రిక్షావాలా షాక్ అయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో జరిగింది. జిల్లాలోని బకల్పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్…
ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో మహిళలకు ప్రోత్సహించాల్సిన నేతలు వారిని తక్కువచేసి మాట్లాడుతున్నారు. చీకటి పడ్డాక మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని పురుషులను తోడుగా తీసుకెళ్లడం మంచిది అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. వారణాసిలోని బజర్డిహా ప్రాంతంలో వాల్మీకి బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్లో మహిళా…
లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. రైతులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్తుండగా ఆమెను అడ్డుకొని రెండు రోజులపాటు గెస్ట్హౌస్లో ఉంచారు. ప్రియాంకగాంధీ గెస్ట్ హౌస్లో నిరసనలు నిరసలు తెలియజేసింది. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో లఖింపూర్ బాధితులను పరామర్శించేందుకు పోలీసులు ప్రియాంక గాంధీకి అనుమతులు ఇచ్చారు. కాగా, ఇప్పుడు మరోసారి ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రా పరిధిలోని జగదీష్…