Toll Tax: జూలై 15 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు టోల్ చెల్లించాల్సి ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. పలు మీడియా నివేదికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఊహాగానాలను గురువారం ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నివేదికలు తప్పుదాడి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులు, డ్రైవర్లకు తీవ్రమైన ఇబ్బందులను కలుగుతాయని ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి లేఖ రాశారు. ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం…
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అనుమతుల కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్లను వాహన్ పోర్టల్కు, డ్రైవింగ్ లైసెన్సులు సారథి పోర్టల్కు మార్చడం, వాహన స్క్రాపింగ్ సౌకర్యాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర…
ఆంధ్రప్రదేశ్లో రూ.252.42 కోట్లు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు..
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. ఈ రోజు అధికార నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరారు. అదే విధంగా.. నియోజకవర్గంలోని 7 రోడ్లకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ స్కీమ్ (CRIF) పరిధిలో నిధులను మంజూరు…
రాజస్థాన్లోని మనోహర్పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు.
ప్రధానమంత్రి పదవి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఆశయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం పెద్ద ప్రకటన చేశారు.