Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ
- G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. లారీలపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అమలైతే దేశవ్యాప్తంగా వాహన యజమానులు, డ్రైవర్లకు తీవ్రమైన ఇబ్బందులను కలుగుతాయని ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి లేఖ రాశారు.
ఈనెల 7న కేంద్ర ప్రభుత్వం G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంట్లో 12 సంవత్సరాల పైబడిన వాహనాలపై తీవ్రమైన పరిమితులు విధించబడ్డాయి. దీనివల్ల లారీలపై ఆధారపడి జీవిస్తున్న వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన G.S.R. 124(E) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వల్ల సంభవించే సమస్యల పరిష్కారానికై లారీ ఓనర్స్ లేవనెత్తిన డిమాండ్స్ చూసినట్లతైతే.. లక్షలాది మంది ఓనర్-కమ్- డ్రైవర్లు తమ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నిబంధనలు అమలైతే వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
Also Read:Hydra: తూముకుంట మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేత… ప్రకృతి రిసార్ట్స్ నేల మట్టం
వారి కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. పాత వాహనాలను నిషేధించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు రవాణా ఛార్జీలు పెరిగి ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ PDS, ఇతర ప్రజా సేవలకు అంతరాయం కలుగుతుంది. అటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ATS పూర్తిగా రద్దు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో నడిపేలా చూడాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించడం వాహన యజమానులపై ఆర్ధిక దోపిడీకి దారితీస్తోంది. కొత్త నిబంధనల వల్ల లక్షలాది వాహన యజమానులు ఆర్థికంగా నష్టపోతారు, వారిపై అదనపు భారం పడుతుంది. వాహన యజమానులు ఇప్పటికే అతిగా వసూలు చేస్తున్న టోల్ చార్జీలపై అసంతృప్తిగా ఉన్నారు.
Also Read:AP MLC Elections 2025: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు..
కొత్త నిబంధనలు మరింత భారం పెంచి కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే ప్రమాదం ఉంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో సంవత్సరముల వారీగా విధించిన అధిక ఫిట్నెస్ ఫీజులను పూర్తిగా తొలగించాలి. బదులుగా చిన్న, మీడియం వాహనాలకు 500లు, హెవీ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు రూ.1,000లు ఫీజును మాత్రమే నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేయాలని లేదా వాహన యజమానులకు ఆర్ధిక భారం పడకుండా సవరించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది ప్రజల జీవనోపాధికి సంబంధించిన దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!