Nitin Gadkari: 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 5 కోట్ల ఉద్యోగాలు..
- భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి
- 2023 నాటికి ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు
- ఎలక్ట్రిక్ రంగానికి సంబంధించి కీలక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వృద్ధి ముందుకు సాగుతుంది. 2023 నాటికి దేశంలోని ఈవీ రంగంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెలిపారు. 2030 నాటికి భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సంభావ్యత రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ వార్త నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.
READ MORE: Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన సూరత్ ప్యాసింజర్స్!
Also Read
- Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
భారతదేశంలో 40 శాతం వాయు కాలుష్యం రవాణా రంగం వల్ల సంభవిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. భారతదేశం ఏటా రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశానికి పెద్ద ఆర్థిక సవాలు. ఈ శిలాజ ఇంధనాల దిగుమతి మన దేశంలో చాలా సమస్యలను సృష్టిస్తోంది. దేశంలో విద్యుత్ వినియోగంలో 44 శాతం సౌరశక్తి నుంచి వస్తుంది. దీంతో ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారిస్తోంది. మన జలవిద్యుత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత సౌరశక్తి, గ్రీన్ ఎనర్జీ, ముఖ్యంగా బయోమాస్ నుంచి వచ్చే శక్తిని అభివృద్ధి పరుస్తున్నాం. సౌరశక్తి మనందరికీ ముఖ్యమైన వనరులలో ఒకటి. భారతదేశం ఎలక్ట్రిక్ బస్సుల కొరతను ఎదుర్కొంటోంది. మన దేశానికి లక్ష ఎలక్ట్రిక్ బస్సులు చాలా అవసరం. అయితే మన దేశ కెపాసిటీ ప్రకారం.. 50,000 బస్సులు తయారు చేయగలం. ఈ బస్సులను తయారు చేసేందుకు, ఫ్యాక్టరీలను విస్తరించేందుకు ఇదే సరైన సమయం.” అని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే ఫ్యాక్టరీలు ప్రారంభించాలని కంపెనీలను ఆయన అభ్యర్థించారు.
READ MORE: Vijayawada: న్యూ ఇయర్కు కొత్త బ్రాండ్లతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైన బెజవాడ
ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఆటోమొబైల్ కంపెనీలను కూడా గడ్కరీ కోరారు. 2014లో తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.7 లక్షల కోట్లు అని చెప్పారు. నేడు ఆటోమొబైల్ రంగం పరిమాణం రూ.22 లక్షల కోట్లని తెలిపారు. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!