Chandrababu Meets Nitin Gadkari: నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతికి అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ..!
- ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ..
- ఈ భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Meets Nitin Gadkari: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. తొలిరోజు బిజీబిజీగా గడిపిన ఆయన.. ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి – రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు..
Read Also: Srinivasulu Whatsapp Story: కరీంనగర్ లో వాట్సాప్ గ్రూప్.. ట్రెండింగ్ అవుతున్న శ్రీనివాస్ అనే పేరు..
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఇక, తొలిరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫలప్రదమైన సమావేశం జరిగింది అంటూ ట్విట్టర్లో పంచుకున్నారు చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు తెలిపాను.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించాను .. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి అందిస్తున్న చేయూతకు ధన్యవాదాలు తెలిపాను.. అమరావతి రాజధాని నిర్మాణానికి మద్దతు అందిస్తున్నారు అంటూ ఎక్స్లో పోస్టు చేశారు..
Read Also: Vinesh Phogat: కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. వీడియో వైరల్!
మరోవైపు.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశంపై కూడా ఎక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో పోస్టు పెట్టారు.. డిసెంబర్లో వైజాగ్ రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తామని.. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది.. హౌరా- చెన్నై నాలుగు లైన్ల ప్రాజెక్టులో ఇది భాగం.. 73 రైల్వేస్టేషన్లో ఆధునికరిస్తారు.. మరిన్ని స్థానిక రైళ్లను నడుపుతారు.. రైల్వే శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం పని చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే.. ఇక, ఈ రోజు సాయంత్రం 4.30కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం అవుతారు.. ఇక, 5:45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీకానున్నారు.. రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు.. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!