ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ప్రధానితో పాటు 72 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి ప్రధాని మోడీ టీమ్లో చాలా మంది పాత ముఖాలకు మళ్లీ అవకాశం దక్కింది. మరి మోడీ ప్రభుత్వంలోని మంత్రులు ఎంత విద్యావంతులుగా ఉన్నారో తెలుసుకుందాం. పీహెచ్డీ పూర్తి చేసిన వారిలో మొత్తం 7 మంది మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఎంబీఏ చదివారు. ప్రధాని…
18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఛాన్స్ ఉందని శుక్రవారం ఈ సమాచారాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాలతో ఈ నెల మూడో వారంలో సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయని పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకారాలు రెండ్రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
AI Mission: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కృత్రిమ మేధ(AI) టెక్నాలజీపై దృష్టిసారించాయి. భవిష్యత్ కాలంలో టెక్ రంగాన్ని ఏఐ శాసిస్తోందని చెబుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తోంది.
దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు వారి 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల 11.07 లక్షల మంది జాతీయ రవాణా సంస్థలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.